ఆగష్టు 23 : చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..

Purushottham Vinay
చరిత్రలో ఈ రోజు జరిగిన జాననాల విషయానికి వస్తే..

1872 వ సంవత్సరంలో టంగుటూరి ప్రకాశం పంతులు జన్మించారు. ఈయన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి.

1900 వ సంవత్సరంలో మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ జన్మించారు. ఈయనో కవి, పండితుడు ఇంకా గ్రంథ ప్రచురణకర్త.

1918 వ సంవత్సరంలో అన్నా మణి జన్మించారు. ఈయన భారత భౌతిక శాస్త్రవేత్త ఇంకా వాతావరణ శాస్త్రవేత్త.

1921వ సంవత్సరంలో కెన్నెత్ ఆరో జన్మించారు. ఈయన ఆర్థికవేత్త.

1923 వ సంవత్సరంలో బలరామ్ జక్కర్ జన్మించారు. ఈయనో రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు ఇంకా మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్.

1923 వ సంవత్సరంలో కులదీప్‌ నయ్యర్‌ జన్మించారు. ఈయన రచయిత ఇంకా అలాగే పత్రికారచయిత.

1932 వ సంవత్సరంలో ఉండేల మాలకొండ రెడ్డి జన్మించారు. ఈయనో ఇంజనీరు ఇంకా తెలుగు రచయిత అలాగే ఓ మంచి కవి.

1949 వ సంవత్సరంలో బి.ఎస్.రాములు జన్మించారు. ఈయనో నవలాకారుడు ఇంకా కథకుడు.

1953 వ సంవత్సరంలో అట్టాడ అప్పల్నాయుడు జన్మించారు. ఈయన ఉత్తరాంధ్రకు చెందిన కథా ఇంకా నవలా రచయిత.

1963 వ సంవత్సరంలో పార్క్ చాన్-వుక్ జన్మించారు. ఈయన దక్షిణ కొరియాకు చెందిన సినీ దర్శకుడు ఇంకా రచయిత అలాగే నిర్మాత.

ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన మరణాల విషయానికి వస్తే..

634 వ సంవత్సరంలో అబూబక్ర్ మరణించడం జరిగింది. ఈయన మహమ్మద్‌ ప్రవక్త ఇస్లాం మతం గురించి ప్రకటించిన తరువాత, ఇస్లాం మతమును స్వీకరించినవారిలో ప్రథముడు.

1890 వ సంవత్సరంలో పురుషోత్తమ చౌదరి మరణించారు. ఈయన తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. అలాగే ఈయన తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు.

1971 వ సంవత్సరంలో షామూ మరణించడం జరిగింది. ఇది అనేక సీ వరల్డ్ ప్రదర్శనలలో అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన ఓ నీటి జంతువు.

1979 వ సంవత్సరంలో జి.వి.కృష్ణారావు మరణించారు. ఈయన హేతువాది ఇంకా రచయిత.

1987 వ సంవత్సరంలో కందిబండ రంగారావు మరణించారు. ఈయన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన ఓ స్వాతంత్ర్య సమరయోధుడు.

1994 వ సంవత్సరంలో ఆరతి సాహా మరణించడం జరిగింది. ఈమె ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ.

2018 వ సంవత్సరంలో కులదీప్‌ నయ్యర్‌ మరణించడం జరిగింది. ఈయన రచయిత ఇంకా పత్రికారచయిత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: