ఆగష్టు 16 : చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు...

Purushottham Vinay
ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్యమైన సంఘటనల విషయానికి వస్తే..
1909 వ సంవత్సరంలో సర్దార్ గౌతు లచ్చన్న జన్మించారు. ఈయన ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఇంకా ఆంధ్ర రాష్ట్ర మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు.
1912 వ సంవత్సరంలో వానమామలై వరదాచార్యులు జన్మించారు. ఈయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన పండితుడు ఇంకా రచయిత.
1919 వ సంవత్సరంలో టంగుటూరి అంజయ్య జన్మించారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి.
1920 వ సంవత్సరంలో కోట్ల విజయభాస్కరరెడ్డి జన్మించారు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు.
1958 వ సంవత్సరంలో మడొన్నా జన్మించింది.(మడొన్నా లూయీ సిక్కోన్). ఈమె ప్రముఖ అమెరికన్ నటి, పాటగత్తె అలాగే పాటల రచయిత్రి.
1978 వ సంవత్సరంలో మంత్రి కృష్ణమోహన్ జన్మించారు. ఈయన 2013 కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత.
1989 వ సంవత్సరంలో శ్రావణ భార్గవి జన్మించారు. ఈమె సినీ గాయని, అనువాద కళాకారిణి ఇంకా గీత రచయిత్రి.
1886 వ సంవత్సరంలో స్వామి రామకృష్ణ పరమహంస మరణించారు. ఈయనొక ఆధ్యాత్మిక గురువు.
1996 వ సంవత్సరంలో చర్ల గణపతిశాస్త్రి మరణించారు. ఈయనో వేద పండితులు ఇంకా గాంధేయవాది అలాగే ప్రాచీన గ్రంథాల అనువాదకులు.
2001 వ సంవత్సరంలో అన్నా మణి మరణించారు. వీరు భారత భౌతిక శాస్త్రవేత్త ఇంకా వాతావరణ శాస్త్రవేత్త.
2004 వ సంవత్సరంలో జిక్కి మరణించారు. వీరు తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు.
2012 వ సంవత్సరంలో టీ.జి. కమలాదేవి మరణించారు. ఈమె తెలుగు సినిమా నటి ఇంకా స్నూకర్ క్రీడాకారిణి.
2018 వ సంవత్సరంలో అటల్ బిహారీ వాజపేయి మరణించారు. ఈయన భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఇంకా భారత రత్న భాజపా నేత.
2020 వ సంవత్సరంలో రాపాక ఏకాంబరాచార్యులు మరణించారు. ఈయన తెలుగు రచయిత ఇంకా అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: