జులై 21: చరిత్రలో ఈరోజు ముఖ్యసంఘటనలు...

Purushottham Vinay
చరిత్రలో ఈరోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే.. క్రీస్తు పూర్వం 0356 వ సంవత్సరంలో హెరోస్ట్రేటస్ అనే యువకుడు  ప్రపంచపు 7 వింతలలో ఒకటైన ఎఫెసిస్ లో ఉన్న ఆర్టెమిస్ ఆలయానికి నిప్పు పెట్టడం జరిగింది.1588 వ సంవత్సరంలో స్పానిష్ ఆర్మడాని ఇంగ్లీష్ వారి నౌకాదళం ఓడించడం జరిగింది.1667 వ సంవత్సరంలో బ్రేడా సంధి అనేది జరిగింది. దీని వలన రెండవ ఆంగ్లేయులు-డచ్చిదేశస్తుల మధ్య జరిగిన రెండవ యుద్ధం అనేది అంతమైంది.1718 వ సంవత్సరంలో పస్సరోవిట్జ్ సంధి ఒట్టోమన్ సామ్రాజ్యానికి ఇంకా ఆస్ట్రియాకి అలాగే రిపబ్లిక్ ఆఫ్ వెనిస్ కి మధ్య జరిగింది.1831 వ సంవత్సరంలో నెదర్లాండ్ నుంచి బెల్జియమ్ స్వాతంత్ర్యం పొందింది. ఇక లియోపోల్డ్ I రాజు అయ్యాడు.1873 వ సంవత్సరంలో అయోవా (పశ్చిమ అమెరికా) రాష్ట్రంలోని అడేర్ దగ్గర జెస్సె జేమ్స్ ఇంకా జేమ్స్ యంగర్ ముఠా మొదటిసారిగా రైలు దోపిడీ చేసారు.

1904 వ సంవత్సరంలో కేమిల్లె జెనాట్జీ కారుని గంటకు 65.79 మైళ్ళ వేగంతో ప్రయాణించి ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది.1931 వ సంవత్సరంలో సి.బి.ఎస్. టెలివిజన్ చానెల్ అమెరికాలో తన 7 రోజుల రోజు వారీ ప్రసారాలను అలాగే క్రమం తప్పకుండా ప్రసారం చేయటం మొదలుపెట్టింది.1934 వ సంవత్సరంలో గల్లిపొలిస్ (అమెరికాలోని ఓహియో రాష్ట్రం) లో 113 డిగ్రీల ఫారెన్‌హీట్ (45 డిగ్రీల సెంటిగ్రేడ్) నమోదయ్యింది. ఇక ఇది ఓహియో రాష్ట్రంలో నమోదు అయిన రికార్డు.1940 వ సంవత్సరంలో ఎస్తోనియా, లాత్వియా ఇంకా లిథూనియా దేశాలను సోవియట్ యూనియన్ తనలో కలిపి వేసుకోవడం జరిగింది.1944 వ సంవత్సరంలో జపాన్ ఆక్రమించిన 'గువామ్' అనే ప్రాంతాన్ని అమెరికన్ దళాలు విడిపించడం జరిగాయి (రెండవ ప్రపంచ యుద్ధం).1949 వ సంవత్సరంలో అమెరికన్ సెనేట్ నార్త్ అట్లాంటిక్ సంధిని (నాటో)ని 82-13 ఓట్లతో రద్దు చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: