జూన్ 9వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

Suma Kallamadi
ప్ర‌తి సంవ‌త్సరంలో ఎన్నో తేదీలు ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుని జూన్ 9వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?
ఆ తేదీలు కొన్ని మ‌ర‌పురాని సంఘ‌ట‌న‌ల‌కు సాక్ష్యంగా ఉంటాయి. ఆ రోజు ఖ‌చ్చితంగా ఏదో ఒక ప్ర‌త్యేక‌మైన మార్పున‌కు శ్రీకారం క‌లిగి ఉంటుంది. అలాంటి విశిష్ట‌త గ‌ల తేదీల‌ను గుర్తు పెట్టుకుని మ‌రీ మ‌నం వాటిని త‌ల‌చుకుంటాం. చరిత్ర‌లో ఈరోజు జూన్ 9కి చాలా ప్రాముఖ్య‌త ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

♥ జననాలు ♥

✦ 1899: సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరైన వామన్ శ్రీనివాస్ కుడ్వ(మ.1967) ఈరోజు జ‌న్మంచారు.

✦  1912: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడైన ఉమ్మెత్తల గోపాలరావు జ‌న్మించారు.

✦ 1931: ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి అయిన నందిని సత్పతీ (మ.2006) ఈ రోజు జ‌న్మించారు.

✦ 1947: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు (మ.2018)ఈరోజు జ‌న్మించారు.

✦  1949: భారత దేశ మహిళా పోలీసు అధికారి, సామాజిక కార్యకర్త అయిన కిరణ్‌ బేడీ జ‌న్మించారు.

✦ 1951: తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన తెలంగాణ శకుంతల(మ.2014) జ‌న్మించారు.

✦ 1954: ప్ర‌ముఖ తెలుగు రచయిత, రాజకీయ విశ్లేషకుడు, భారతదేశపు తొలి దళిత కార్డియాలజిస్టు అయిన ఎం. ఎఫ్. గోపీనాథ్ జ‌న్మించారు.

✦ 1959: భారత పార్లమెంటు సభ్యుడు, అయిన జి.వి.హర్షకుమార్ జ‌న్మించారు. ఈయ‌న 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచారు.

✦  1977: భారతీయ సామాజిక కార్యకర్త అయిన రూపా మిశ్రా జ‌న్మించారు. ఈమె 2003-2004 IAS లో టాపర్‌.


 
♡ మరణాలు ♡

✦ 1949: వంగోలు వెంకటరంగయ్య ఈయ‌న బహుభాషా పండితుడు, న్యాయవాది, రచయిత మ‌ర‌ణించారు.

✦   1995: భారత స్వాతంత్య్ర‌ సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు అయిన ఎన్.జి.రంగా(జ.1900) మ‌ర‌ణించారు.

✦   2011: అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్ర‌ముఖ భారతీయ చిత్రకారుడు(జ.1915)ఎమ్.ఎఫ్. హుస్సేన్ ఈ రోజు మ‌ర‌ణించారు.

✦ 2012: ఆదిలాబాదు జిల్లా కలెక్టరుగా పనిచేసిన పాలపర్తి వెంకటేశ్వర్లు ఈరోజు మ‌ర‌ణించారు.

✦ 2017: తెలంగాణా రాష్ట్రానికి చెందిన ప్ర‌ముఖ రాజకీయ నాయకుడుపాల్వాయి గోవర్ధన్ రెడ్డి (జ.1936) మ‌ర‌ణించారు.

✦   2019: మహిళల ఆర్థిక స్వేచ్ఛకోసం "మహిళా సంఘాల"ను ప్రారంభించిన‌బి.వి.పరమేశ్వరరావు (జ.1933) ఈరోజు మ‌ర‌ణించారు.

 
✷ సంఘటనలు ✷

✦  1900 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు అయిన బిర్సా ముండా బ్రిటిష్ జైలులో అనూహ్యమైన రీతిలో ఈరోజు మరణించాడు.

✦ 1964 : ఈరోజు భారత ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి నియమితుడై చ‌రిత్ర సృష్టించాడు.

✦  2006 : ప్రపంచ కప్పు సాకర్ పోటీలు జర్మనీలో ఈరోజు అట్ట‌హాసంగా ప్రారంభమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: