చరిత్రలో మే 21 కి వున్న ప్రత్యేకత...

Purushottham Vinay
మనం చరిత్ర అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మనం బ్రతికే ప్రతిరోజుకి కూడా ఒక అద్భుతమైన చరిత్ర ఉంటుంది. కాబట్టి ఈ రోజుకి వున్న ప్రాధాన్యత గురించి తప్పక తెలుసుకోండి. ఈరోజు తేదీ మే 21. చరిత్రలో ఈ నాడు జరిగిన గొప్ప గొప్ప సంఘటనలు, గొప్ప గొప్ప వ్యక్తుల జాననాలు, ఇక మరణాలు, అలాగే ఈ రోజుకి ఉండే ప్రత్యేకతలు గురించి తెలుసుకోండి.

ప్రముఖ సంఘటనలు....

0143: అగ్ర రాజ్యం అమెరికా చరిత్రకారులకు తెలిసిన అతిప్రాచీనమైన సంవత్సరం ఇది. ఈ రోజున 'మాయా నాగరికత' కన్నా ముందు పాలించిన రాజు 'కింగ్ హర్వెస్ట్-బెర్‌గ్వోర్‌స్ట్' సింహాసనం అదిష్టించారు.

1502: సెయింట్ హెలెనా దీవిని పోర్చుగీస్ కి చెందిన నౌకాదళాధికారి అడ్మిరల్ జోడ నోవా ఈ రోజున కనుగొనడం జరిగింది.

1819: చరిత్రలో ఈనాడు మొట్టమొదటి 'సైకిల్'  ని అమెరికా లోని న్యూయార్క్ నగరంలో ప్రవేశపెట్టారు.

1829:ఈ రోజున మన హైదరాబాద్ కు చెందిన సికింద్రాబాద్ కు ఆ పేరు రావటానికి కారణమైన సికిందర్ ఝా అసఫ్ జాహి మరణించాడు.

1851: చరిత్రలో ఈ దినాన దక్షిణ అమెరికా లోని కొలంబియాలో బానిసత్వాన్ని రద్దుచేయడం జరిగింది.

1937: చరిత్రలో ఈరోజున ఆర్కిటిక్ మహాసముద్రం మంచు ఖండాల మీద సోవియట్ రష్యా తన మొట్టమొదటి వైజ్ఞానిక పరిశోధక కేంద్రం మొదలు పెట్టింది.

1938:ఇక ఈ దినాన 'ఆస్ట్రేలియ-సర్రీ' క్రికెట్ మాచ్ లో బ్రాడ్‌మన్ 143 పరుగులు సాధించాడు. (198 నిమిషాలు 11 ఫోర్లు (ఫోర్స్)).

1991: రాజీవ్ గాంధీ, మాజీ భారత ప్రధాన మంత్రిని, 'నళిని' అనే మహిళ తన నడుముకి కట్టుకున్న బాంబును పేల్చి ('ఎల్.టి.టి.ఇ' కి చెందిన ఆత్మాహుతి దళ సభ్యురాలు) హత్య చేసింది.

1994: ఇండియన్ బాలీవుడ్ నటి సుస్మితా సేన్,18 సంవత్సరాల వయసులో, 43వ మిస్ యూనివర్స్ అయ్యింది.

2007: కడప జిల్లాలో కోటి టన్నుల సామర్ద్యము గల ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం అప్పటి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వము గాలి జనార్ధన రెడ్డికి చెందిన బ్రహ్మణి ఇండస్ట్రీస్ తో ఒప్పందం చేసుకుంది.


ప్రముఖుల జాననాలు...

0427 బి.సి. : ప్లాటో (అరిస్టోక్లెస్), ఏథెన్స్

1688: అలెగ్జాండర్ పోప్ పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు, తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు.

1893: ఏకా ఆంజనేయులు, సాహితీ పోషకుడు, భువనవిజయం సాహితీరూపక రూపశిల్పి.

1941: భమిడి కమలాదేవి, సంగీత విద్వాంసురాలు.

1961: రాళ్ళబండి కవితాప్రసాద్, తెలుగు అవధాని, కవి.

1991: జాని తక్కెడశిల, తెలుగు కవి, రచయిత, విమర్శకులు.


ప్రముఖుల మరణాలు...

1786: కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే, జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త.

1940: కౌతా ఆనందమోహనశాస్త్రి, వీరు వివిధ శైలీభేదాలను అనుసరించి నూటికి పైగా చిత్రాలను చిత్రించారు.

1991: రాజీవ్ గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి.

2019: బొద్దులూరి నారాయణరావు తెలుగు కవి, పండితుడు.


పండుగలు, జాతీయ దినాలు...

1.చిలీ దేశపు నేవీ డే (నౌకాదళ దినోత్సవము) (1879 లో జరిగిన ఇంక్విక్ యుద్ధం).

2.సెయింట్ హెలెనా దినోత్సవము (1502 లో ఇదేరోజున ఈ దీవిని కనుగొన్నారు)

3.ప్రపంచ సాంస్కృతిక దినోత్సవము.

4.జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: