పెరుగుని వీటితో కలిపి తింటున్నారా? అయితే ప్రమాదమే?

Purushottham Vinay
మనలో చాలా మందికి కూడా పెరుగు తినే అలవాటు ఉంటుంది. అసలు కొంతమందికి అయితే పెరుగు తిననిదే భోజనం చేసినట్లు అనిపించదు.అందుకే మంది పెరుగును తప్పనిసరిగా రోజూ తింటుంటారు. ఇక ఇది ప్రొబయోటిక్ ఆహారం. దీన్ని తింటే మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పెరుగు మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. అందుకే పెరుగును తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుంది. అయితే పెరుగు మన శరీరానికి మేలు చేసేదే అయినా కొన్ని ఆహారాలతో కలిపి తింటే మాత్రం అది ఖచ్చితంగా విషంగా మారుతుంది.అందుకే ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను ఎట్టి పరిస్థితిలోనూ పెరుగుతో కలిపి తినరాదు. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.పాలు, పెరుగు అనేవి రెండూ కూడా ఒకే జాతికి చెందినవి. అయినప్పటికీ రెండింటినీ ఒకేసారి అస్సలు తీసుకోరాదు. ఎందుకంటే వీటిని కలిపి తీసుకుంటే అసిడిటీ, గుండెల్లో మంట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


పాల ఉత్పత్తులు వేటినీ కూడా అస్సలు కలిపి తీసుకోకూడదు. ఇంకా అలాగే నూనె లేదా కొవ్వు పదార్థాలతో కూడా పెరుగును కలిపి తినరాదు. వాటిని తింటే జీర్ణం అయ్యేందుకు టైం ఖచ్చితంగా పడుతుంది. దీంతో అజీర్తి, విరేచనాలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.చాలా మామిడి పండ్లను కూడా పెరుగుతో కలిపి తింటారు. అప్పుడప్పుడు ఒకే. కానీ ఎప్పుడు కూడా తినరాదు. ఎందుకంటే మామిడి పండ్లు సహజంగానే వేడి చేసే స్వభావం కలవి. పెరుగుతో మన శరీరానికి చలువ చేస్తుంది. ఇవి రెండూ కూడా విరుద్ధ స్వభావం ఉన్న ఆహారాలు. అందుకే ఈ రెండింటినీ కూడా కలిపి తినరాదు. తింటే మన జీర్ణక్రియ మందగిస్తుంది. చర్మ సమస్యలు వస్తాయి. అలాగే ఉల్లిపాయలను చాలా మంది పెరుగులో నంజుకుని తింటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం ఈ రెండింటినీ కలిపి అస్సలు తినకూడదట. అలా తింటే శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. జీర్ణ సమస్యలు అనేవి వస్తాయి. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెరుగు, ఉల్లిపాయలను అస్సలు కలిపి తినరాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: