ఇలా నీళ్లు తాగితే సమస్యలు తప్పవు?

Purushottham Vinay
వేసవి కాలంలో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే సమృద్ధిగా నీరు తాగాలి. ఒక్క వేసవి కాలం మాత్రమే కాదు ఏ సీజన్లో అయినా అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా నీరు తాగాల్సిందే. ఒక మనిషి అన్నం తినకుండా అయినా బ్రతక గలడేమో కానీ నీరు తాగకుండా మాత్రం ఎక్కువ కాలం బ్రతకలేరు.కాబట్టి ఖచ్చితంగా ప్రతి రోజూ నీళ్లు తాగాలి.ప్రతి రోజూ  తాగాల్సినంత నీరు తాగకపోతే శరీరం ఖచ్చితంగా డీహైడ్రేట్‌ అవుతుందని డాక్టర్లు, డైటీషియన్‌, బ్యూటీషియన్‌ సలహాలు ఇస్తూనే ఉంటారు.జుట్టు, చర్మంతోపాటు అన్ని శరీర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నీరు ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అయితే నీరు ఎలా త్రాగితే మరింత ప్రయోజనం పొందుతారు? అసలు నీటిని తాగడానికి సరైన మార్గం ఏమిటి? ప్రతి రోజూ ఎంత మొత్తంలో నీరు తీసుకోవాలి? వంటి విషయాలపై చాలా మందికి కూడా సరైన అవగాహన అనేది ఉండదు.అయితే సంపూర్ణ ఆరోగ్యం కోసం నీరు ఎలా తాగాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


 తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతారు. కానీ ఒక నిర్ణీత సమయం తర్వాత మాత్రమే నీరు త్రాగాలి. ముఖ్యంగా తిన్న వెంటనే నీళ్లు తాగకపోవడమే ఆరోగ్యానికి మంచిది.ముఖ్యంగా వేసవి కాలంలో చాలా మందికి చల్లటి నీరు తాగడం అలవాటు. చాలా మంది నేరుగా రిఫ్రిజిరేటర్ నుంచి నీటిని తాగుతుంటారు. ఈ పద్ధతి కూడా సరైనది కాదు. అత్యంత చల్లగా ఉంటే నీటిని ఒకేసారి మాత్రం అస్సలు తాగకూడదు.అలాగే ఖాళీ కడుపుతో కూడా ఒకేసారి ఎక్కువ నీరు తాగితే వాంతులు అవుతాయి. అలాగే భోజనానికి ముందు లేదా తర్వాత వెంటనే నీరు త్రాగవద్దు. భోజనానికి కొద్దిసేపటి ముందు నీరు త్రాగాలి.ఎల్లప్పుడూ కూడా పడుకుని మాత్రం నీరు త్రాగకూడదు. నీటిని ఎప్పుడూ కూర్చొని మాత్రమే సేవించాలి. అధికంగా దాహం వేస్తున్నందున్నప్పుడు ఒకేసారి ఎక్కువ నీరు త్రాగవద్దు. ఇది వాంతులు వంటి సమస్యలను కలిగిస్తుంది. కడుపు నిండా నీళ్లు ఎక్కువగా తాగకపోవడమే మంచిది. కాబట్టి పై విషయాలు దృష్టిలో పెట్టుకొని నీళ్లు తాగండి. ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: