మనం చేసేటప్పుడు, పూజ చేస్తున్నప్పుడు కాళ్లూ, చేతులూ కాలడం అనేవి చాలా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్నవి అయితే పర్లేదు తగ్గిపోతాయి కానీ.. పెద్దగా కాలితే మాత్రం చాలా నొప్పిగా ఉంటాయి.బొబ్బలు, ఆపై మచ్చలు వచ్చి ఖచ్చితంగా చాలా విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీంతో కొంత మంది డాక్టర్ దగ్గరకు వెళ్తే.. మరి కొంత మంది మెడికల్ షాపులో దొరికే మందులతో ఉపశమనం పొందుతారు. ఇంకొంత మంది అయితే తమకు తెలిసిన చేతి వైద్యం చేసుకుంటారు. ఏది ఏమైనా కానీ ఇలా కాలిన గాయాల నొప్పి మాత్రం త్వరగా తగ్గవు. దీంతో వేరే పని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇలా ఈ గాయాల నొప్పి తగ్గాలంటే ఇప్పుడు చెప్పే టిప్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. మరి ఆ టిప్స్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.కాలిన వెంటనే చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే.. ట్యాప్ కింద పెట్టడం లేదా నీళ్లతో కడగడం వంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నొప్పి ఇంకా ఎక్కువ అవ్వడమే కాకుండా బొబ్బలు వస్తాయి.
అలా కాకుండా తడి క్లాత్ ని వాటర్ తో తడిపి ఆ నీళ్లను పిండేసి గాయంపై చుట్టాలి. ఆ తర్వాత మెల్లగా నొక్కి ఉంచితే బొబ్బలనేవి రాకుండా ఉంటాయి.చాలా మందికి కూడా కాలిన గాయంపై ఏది పెట్టాలో తెలియదు. అలాంటప్పుడు వైట్ వెనిగర్ నేరుగా రాయవచ్చు.ఇక నార్మల్ వెనిగర్ ఉంటే మాత్రం.. నీటితో కొద్దిగా కలిపి రాయవచ్చు. ఇలా చేస్తే మంట, వాపు అనేవి చాలా త్వరగా తగ్గుతాయి.సాధారణంగా అందరి ఇళ్లలో పెరుగు,పసుపు ఎక్కువగా ఉంటాయి.మీరు పెరుగులో కొద్దిగా పసుపు కలిపి.. కాలిన గాయాలపై నేరుగా రాయవచ్చు. ఇలా రాయడం వల్ల మంట, నొప్పి ఇంకా వాపు తగ్గడమే కాకుండా.. గాయం కూడా చాలా త్వరగా నయం అవుతుంది.చాలా మంది కూడా కాలిన వెంటనే టూత్ పేస్ట్ రాస్తూ ఉంటారు.అయితే ఇది మంచి పనే అయినప్పటికీ కాలిన గాయంపై వెంటనే టూత్ పేస్ట్ రాయ కూడదు. ఎందుకంటే అలా చేస్తే నొప్పి అనేది ఎక్కువ అవుతుంది. తడి క్లాత్ తో గాయంపై కాసేపు ఉంచి ఇక ఆ తర్వాత టూత్ పేస్ట రాయలి. ఇలా చేస్తే మంట పోయి మీకు చల్లగా ఉంటుంది. ఇంకా అలాగే గాయం కూడా త్వరగా నయం అవుతుంది.