రోజు అరగంట నడిస్తే కలిగే లాభాలు ఇవే?

Purushottham Vinay
నడవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది కూడా నడవడానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం ప్రతి రోజూ 15 నుండి 30 నిమిషాల పాటు ఖచ్చితంగా నడవాలని చెబుతున్నారు. నడవడానికి సమయాన్ని తప్పకుండా కేటాయించాలని నిపుణులు చెబుతున్నారు. నడవడానికి సమయాన్ని కేటాయించాలంటే నడవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి రోజూ అరగంట పాటు నడవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి ఇంకా అసలు నడవడానికి సమయాన్ని ఎందుకు కేటాయించాలి వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి రోజూ నడవడం వల్ల మెదడు చాలా చురకుగా పని చేస్తుంది. రోజూ నడవడం వల్ల శరీరంలో ఎండోర్ఫిన్ విడుదల అవుతుంది. దీంతో ఒత్తిడి సులభంగా తగ్గుతుంది. ఇంకా అంతేకాకుండా అల్జీమర్స్, డైమెన్షియా వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. నడవడం వల్ల మన కంటి ఆరోగ్యం కూడా పెరుగుతుంది. రోజు నడవడం వల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది. కంటిచూపు బాగా మెరుగుపడుతుంది. ఇంకా అంతేకాకుండా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.



గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. శరీరం రక్తప్రసరణ వ్యవస్థ కూడా చురుకుగా పని చేస్తుంది. ఇంకా అంతేకాకుండా నడవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు ఈజీగా తొలగిపోతాయి. ఇంకా అలాగే నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వారు ప్రతి రోజూ నడవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రతి రోజూ నడవడం వల్ల జీర్ణక్రియ చురుకుగా పని చేస్తుంది. మలబద్దకం సమస్య ఈజీగా తగ్గుతుంది. ప్రతి రోజూ నడవడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. మన ఎముకలు పెలుసుగా మారకుండా గట్టిపడతాయి. కీళ్లు బలంగా మారడంతో పాటు కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.ఇంకా అలాగే మనలో చాలా మంది గంటల కొద్ది కూర్చుని పని చేస్తూ ఉంటారు. అలాంటి వారు ప్రతి రోజూ నడవడం వల్ల వెన్నెముకకు రక్తప్రసరణ పెరగడంతో పాటు వెన్నునొప్పి కూడా ఈజీగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: