ఈ రోజుల్లో చాలా మంది కూడా కంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. చాలా మంది కంటి చూపును మెరుగుపరుచుకోవడం కోసం కళ్లద్దాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఎలాంటి అద్దాలు వాడే అవసరం లేకుండా మనకు ఈజీగా లభించే పదార్థాలతో ఒక స్మూతీని తయారు చేసుకుని తాగడం వల్ల మనం మన కంటి చూపును చాలా ఈజీగా మెరుగుపరుచుకోవచ్చు.ఇంకా ఈ స్మూతీని తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడడంతో పాటు శరీరానికి కూడా చాలా మేలు కలుగుతుంది. కంటిచూపును మెరుగుపరిచి కంటి సమస్యలను తొలగించే ఈ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలి ఇంకా దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇక ఈ స్మూతీని తయారు చేసుకోవడానికి మనం అర కప్పు కలబంద గుజ్జును ఇంకా అర కప్పు తరిగిన వాల్ నట్స్ ను అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనెను, రెండు నిమ్మకాయల రసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో నీటిని మీరు తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో కలబంద గుజ్జును వేసి ఒక 10 నిమిషాల పాటు దానిని ఉడికించాలి. ఆ తరువాత నీటిని వడకట్టి కలబంద గుజ్జును 10 నుండి 12 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి.
ఇక ఇలా ఫ్రిజ్ లో ఉంచిన కలబంద గుజ్జును ఒక జార్ లోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో పైన చెప్పిన మిగిలిన పదార్థాలన్నింటిని కూడా వేసి స్మూతీలా అయ్యే దాకా మిక్సీ పట్టుకోవాలి.తరువాత ఈ స్మూతీని మూడు భాగాలుగా చేసి పూటకు ఒక భాగం చొప్పున మీరు తాగాలి. ఇక ఈ స్మూతీని మూడు పూటలా ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు తాగాలి. ఇలా తాగడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. ఈ స్మూతీ తయారీలో ఉపయోగించిన ప్రతి పదార్థం కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ఇక వీటిలో ఉండే పోషకాలు కంటి సమస్యలను తగ్గించడంలో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఈ విధంగా కంటి చూపు తగ్గడం, మక్యులర్ డీ జెనరేషన్ ఇంకా కంటిలో శుక్లాలు వంటి సమస్యలతో బాధపడే వారు ఈ విధంగా స్మూతీని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.