వానాకాలంలో ఈ పండు తింటే బోలెడు లాభాలు?

Purushottham Vinay
మనకు సీజనల్గా లభించే పండ్లల్లో ఆల్ బుకరా పండ్లు కూడా ఒకటి. ఈ పండుని ఇండియన్ ప్లమ్ అని కూడా అంటారు. ఈ పండ్లు మనకు వర్షాకాలంలో చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి.ఈ పండ్లు చాలా పుల్ల పుల్లగా ఇంకా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది కూడా ఈ పండ్లను ఇష్టంగా తింటారు. ఇంకా రుచితో పాటు ఈ పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వర్షాకాలంలో వీటిని తప్పకుండా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.అయితే వర్షాకాలంలో ఈ ఆల్ బుకరా పండ్లను ఖచ్చితంగా ఎందుకు తీసుకోవాలి.. వీటి వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.



మనం జ్వరంతో ఎక్కువగా బాధపడుతున్నప్పుడు ఈ ఆల్ బుకరా పండ్లను తీసుకోవడం వల్ల అవి నోటికి రుచిగా ఉండడంతో పాటు జ్వరం నుండి కూడా త్వరగా కోలుకుంటారు.ఇంకా అలాగే ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. అలాగే ఎముకలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అలాగే కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ రెండు పూటలా ఈ పండ్లను 3 నుండి 4 చొప్పున మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం బాగా మెరుగుపడి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు పరిశోధనల ద్వారా తెలిసింది. 



ఆల్ బుకరా పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి.ఇంకా అలాగే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి చాలా బాగా మెరుగుపడుతుంది.ఈ ఆల్ బుకరా పండ్లల్లో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉంటాయి. 100గ్రాముల ఆల్ బుకరా పండ్లల్లో 87 గ్రాముల నీటిశాతం అనేది ఉంటుంది. 11 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 44 క్యాలరీల శక్తి ఇంకా ఒకటిన్నర గ్రాముల పీచు పదార్థాలు ఉన్నాయి. ఈ పండ్లల్లో తక్కువ శక్తి ఇంకా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.అందుకే వర్షాకాలంలో ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.అలాగే దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. ఈ వర్షాకాలంలో చాలా మంది జబ్బుల బారిన పడుతూ ఉంటారు. ఈ పండ్లను తీసుకోవడం వల్ల వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అంటువ్యాధులు, జబ్బులు మన దగ్గరకి రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: