నోటి సమస్యలు మాయం అయ్యే సింపుల్ టిప్?

Purushottham Vinay
చాలా మంది కూడా నోటి దుర్వాసన, దంతక్షయం, నాలుకపై ఎక్కువగా పాచి పేరుకుపోవడం ఇంకా దంతాలు గారపట్టడం వంటి సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు.నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రోజుకు రెండు పూటలా టూత్ పేస్ట్ తో దంతాలను శుభ్రం చేసుకున్నప్పటికి ఎలాంటి ఫలితం లేదు.మన మార్కెట్ లో దొరికే వివిధ రకాల టూత్ పేస్ట్ లకు వాడినప్పటికి ఈ సమస్యలు ఏ మాత్రం తగ్గు ముఖం పట్టడం లేదు.అయితే మన నోటి ఆరోగ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం. మనం ఎక్కువగా జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల, పంచదార కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల ఇంకా శీతల పానీయాలను తాగడం వల్ల నోటి ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది.వీటిని తిన్న తరువాత నోటిని శుభ్రం చేసుకున్నప్పటికి మన రుచిగులికల్లో పంచదార ఉంటుంది. ఇలా నోట్లో ఉండే పంచదార వల్ల నోట్లో చెడు బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. దీంతో దంతాలు పుచ్చిపోవడం, గార పట్టడం, నాలుకపై పాచి ఎక్కువగా పేరుకుపోవడం ఇంకా దంతాలు పుచ్చిపోవడం వంటివి జరుగుతుంది.


 మన నోటి ఆరోగ్యం మెరుగుపడాలంటే మనం జంక్ ఫుడ్ ను తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పంచదార ఉండే పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవాలి. దీంతో పాటు ఒక చక్కటి టిప్ ని పాటించాలి. ఈ టిప్ ని పాటించడం వల్ల నోట్లో చెడు బ్యాక్టీరియా అనేది పెరగకుండా ఉంటుంది. ఈ టిప్ ని వాడడం కూడా చాలా ఈజీ.ఇందు కోసం రోజూ రాత్రి పడుకునే ముందు నోట్లో రెండు టీ స్పూన్ల తేనెను వేసుకోవాలి. ఈ తేనెను అన్ని దంతాలకు ఇంకా చిగుళ్లకు తగిలేలా చప్పరించాలి. ఇక నోట్లో నీళ్లు పోసి పుక్కిలించకుండా ఈ తేనెను నోట్లో అలాగే ఉంచుకుని నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన సమస్య ఈజీగా తగ్గుతుంది.మన దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి. అలాగే నాలుకపై పాచి పేరుకుపోవడం తగ్గుతుంది. ఇంకా తేనె యాంటీ బ్యాక్టీరియల్ గా పని చేస్తుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియాలను ఇది ఈజీగా నశింపజేస్తుంది. దీంతో నోట్లో బ్యాక్టీరియా శాతం ఈజీగా తగ్గుతుంది. ఇంకా నోటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా తేనెను వాడటం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: