బరువు పెరగాలనుకునే వారికి అద్భుతమైన టిప్?

Purushottham Vinay
ఇక బరువు పెరగాలనుకునే వారు శరీరానికి అంత కంటే ఎక్కువ క్యాలరీలను ఖచ్చితంగా అందించాలి. మన ఇంట్లో ఉండే పదార్థాలతో ప్రోటీన్ స్మూతీని తయారు చేసుకుని తాగడం వల్ల ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు.ఇక మన బాడీకి ఎక్కువ క్యాలరీలను ఆరోగ్యకరంగా అందించే పదార్థాల్లో ముఖ్యమైనది అరటి పండు. బాగా పండి మచ్చలు ఉన్న అరటి పండును తినడం వల్ల మరిన్ని పోషకాలను పొందవచ్చు. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాస్ పాలల్లో రెండు అరటి పండ్లను వేసి స్మూతీలాగా తయారు చేసుకోవాలి. ఇంకా అలాగే ఈ పాలల్లో అరటి పండ్లతో పాటు రాత్రంతా కూడా నానబెట్టిన ఒక 10 లేదా 15 ఎండు ద్రాక్ష పండ్లను వేసి స్మూతీ లాగా తయారు చేసుకోవాలి.ఈ నానబెట్టిన ఎండు ద్రాక్ష పండ్లు శరీర బరువును పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.ఇక ఇలా తయారు చేసుకున్న స్మూతీని ఉదయం ఇంకా సాయంత్రం తీసుకోవడం వల్ల చాలా త్వరగా బరువు పెరగవచ్చు. ఈ స్మూతీని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే బలహీనతలు కూడా చాలా ఈజీగా తగ్గు ముఖం పడతాయి. శరీరంలో నీరసం ఇంకా నిస్సత్తువ వంటి సమస్యలు తగ్గి రోజంతా కూడా ఉత్సాహంగా ఉండవచ్చు.


దీనిని తీసుకోవడం వల్ల కండరాలు కూడా చాలా బలంగా తయారవుతాయి. స్త్రీలు దీనిని తీసుకోవడం వల్ల నెలసరి సమస్యలు కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి. ఇక ఈ స్మూతీని తాగడం వల్ల బరువు పెరగడంతో పాటు ఆరోగ్యంగా కూడా తయారవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక బరువు పెరగాలనుకునే వారు ఈ స్మూతీని తీసుకుంటేనే రోజూ గుప్పెడు నానబెట్టిన నల్ల శనగలను ఖచ్చితంగా తీసుకోవాలి.ఎందుకంటే ఈ శనగలల్లో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినన్ని ప్రోటీన్లు లభించి చాలా త్వరగా బరువు పెరగవచ్చు. శనగలను తీసుకోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా మన దగ్గరకి చేరకుండా ఉంటాయి.ఇంకా అలాగే బరువు పెరగాలనుకునే వారు తక్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల తీసుకున్న ఆహారం చక్కగా శరీరానికి వంట పడుతుంది. బరువు పెరగాలనుకునే వారు, సన్నగా ఉన్న వారు ఈ టిప్స్ పాటించడం వల్ల చాలా ఆరోగ్యవంతంగా బరువు పెరగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: