నరాల బలహీనత రావడానికి ప్రధాన కారణం పోషకాలు లేని ఆహారం తీసుకోవడం. ప్రధానంగా బి విటమిన్ ఇంకా బి కాంప్లెక్స్ విటమిన్ ఆహారంలో లోపించటం కారణంగానే నరాల వీక్నెస్ వస్తుంది. బీ కాంప్లెక్స్ విటమిన్లు గింజధాన్యాలు పొట్టులో అధికంగా లభిస్తాయి. గింజలు, ధాన్యాల పై పొరలలో బి కాంప్లెక్స్ విటమిన్ చాలా ఎక్కువ శాతంలో లభిస్తుంది. పాలిష్ పట్టిన ఆహారాన్ని తీసుకోవటం వల్ల బీ కాంప్లెక్స్ లోపం ఏర్పడుతుంది. దీంతో నరాల వీక్నేస్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు, పెసలు కందులు ఇంకా మినుములు మొదలగు వాటి నన్నింటిని వీలైనంతవరకు పొట్టు తీయకుండానే రవ్వ మరియు పిండి చేసుకుని ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల నరాల బలహీనత సమస్యకు ఎలాంటి మందులు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఎదిగే వయస్సు పిల్లలకు వీటిని ఇవ్వటం ద్వారా దేహ దారుఢ్యాన్ని పెంపొందించుకోవచ్చు.పాలిష్ పట్టని బియ్యము తో అన్నము, రాగి సంగటి, జొన్న సంగటి ని ప్రధాన ఆహారంగా తీసుకోవాలి.
ఈ గింజ ధాన్యాలలో పైపొర లో అధిక శాతంలో బీ-కాంప్లెక్స్ విటమిన్లు ఉండటం వల్ల ఇవి శరీరానికి ముఖ్యంగా నరాలకు ఉపయోగపడతాయి. ముడి ధాన్యాలు పిండి చేసుకుని నేరుగా ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సక్రమంగా లభిస్తాయి. దీని ద్వారా నరాల బలహీనత సమస్యను తొలగించుకోవచ్చు.కూరగాయలు ఆకుకూరలు ఇంకా అలాగే దుంపలు ఇవి మాత్రమే కాదు. ధాన్యాలు విత్తనాలను కూడా ప్రధాన ఆహార భాగాలుగా మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఈ ధాన్యాలు ఇంకా విత్తనాలలో మాంసకృత్తుల తో పాటు శరీరానికి కావలసిన విటమిన్లు శాతము అధికంగా ఉంటుంది. అయితే వీటిని పాలిష్ పట్టి తినడం వల్ల మనకు అందాల్సిన పోషకాలు కోల్పోతున్నాం. పాలిష్ పట్టిన వాటిని తినడం వీలైనంత త్వరగా మానివేయాలి.