మధుమేహం వున్నవారు ఈ ఆహారాలు ఖచ్చితంగా తీసుకోండి?

Purushottham Vinay
మధుమేహం వున్న వారు ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను అతిగా తీసుకోవడం వల్ల మధుమేహం పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు రోజూ తీసుకునే ఆహారంలో కేవలం పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి తప్పకుండా అల్పాహారంలో భాగంగా ఈ కింద పేర్కొన్న ఆహారాలు తీసుకుంటే మంచిది. అయితే మధుమేహం నియంత్రణలో ఉండడానికి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఓట్స్ చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. అయితే మధుమేహంతో బాధపడేవారు ఓట్స్‌ను ఆమ్లెట్‌లా వినియోగిస్తే సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గించుకోవచ్చని నిపుణులు తెలుపతున్నారు.మధుమేహంతో బాధపడుతున్నవారు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా తీసుకోవాల్సినవి మొలకలు. ఇందులో ఉండే మూలకాలు రక్తంలో చక్కెర పరిమాణాలను సులభంగా తగ్గిస్తాయి.



అంతేకాకుండా వీటిని దోసలా చేసుకుని తీసుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.తాజా మెంతి ఆకులు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ డయాబెటిస్‌ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ పరాటాను ఉదయం పూట టిఫిన్‌లో తీసుకుంటే మధుమేహం సులభంగా నియంత్రణలో ఉంటుంది.గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని అందరూ క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటారు. అయితే మధుమేహంతో బాధపడేవారు ఉడకబెట్టిన గుడ్డును ప్రతి రోజూ తీసుకుంటే శరీరం దృఢంగా తయారు కావడమేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీరు ఆరోగ్యంగా ఉండడానికి ఆమ్లెట్‌లను తయారు చేసుకుని కూడా ఆహారంలో తీసుకోవచ్చు.మధుమేహం ఉన్నవారు తాజా కూరగాయలను తీసుకుని శెనగపిండిలో వేసి సలాడ్స్‌లా తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలగడమేకాకుండా మధుమేహం సులభంగా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: