ఇక ప్రస్తుతం వర్షాకాలం సీజన్ అనేది నడుస్తోంది. దీని వల్ల చాలా మంది కూడా ఇప్పటికే సీజనల్ వ్యాధులతో చాలా బాధపడుతున్నారు. ఈ సీజన్ అనేది ఇంకో రెండు నెలల వరకు కూడా ఉంటుంది.కాబట్టి ఈ సమయంలో మనం ఆరోగ్యం, ఆహారం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలను పాటించాలి. లేదంటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యల బారిన పడతాం. మనకు రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉండాలి. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యను అయినా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఇక ఈ సీజన్లో చాలా మందికి దగ్గు ఇంకా జలుబు వస్తుంటాయి. అలాంటి వారు కింద తెలిపిన విధంగా పలు చిట్కాలను పాటించడం వల్ల ఆ సమస్యల నుంచి చాలా ఈజీగా ఉపశమనం పొందవచ్చు. ఇక దగ్గు, జలుబులను తగ్గించే పవర్ఫుల్ చిట్కాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఒక టీస్పూన్ తేనెలో అంతే మోతాదులో అల్లం రసంని కలిపి రోజుకు మూడు పూటలా తాగుతుండాలి. ఈ రెండింటిలో ఉండే శక్తివంతమైన యాంటీ వైరల్ గుణాలు దగ్గు ఇంకా జలుబులను తగ్గిస్తాయి. వాటి నుంచి వెంటనే మీకు ఉపశమనం లభిస్తుంది.
ఇంకా అలాగే ఒక టీస్పూన్ తేనెలో పావు టీస్పూన్ మిరియాల పొడిని కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. దీంతో కూడా దగ్గు ఇంకా జలుబు తగ్గుతాయి.అలాగే ఒక గ్లాస్ నీటిలో చిన్న అల్లం ముక్క ఇంకా కాస్త చక్కెర వేసి కలిపి మరిగించాలి. నీరు సగం గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించి అనంతరం ఆ మిశ్రమాన్ని వడకట్టి తాగాలి.ఇక ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మీకు తప్పక ఫలితం అనేది కనిపిస్తుంది.మిరియాలు అర టీస్పూన్ ఇంకా అలాగే ధనియాలు ఒక టీస్పూన్ తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి సగం గ్లాస్ అయ్యాక వచ్చే ఆ మిశ్రమాన్ని వడకట్టి తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే దగ్గు ఇంకా జలుబు నుంచి మీకు మంచి ఉపశమనం లభిస్తుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ చిట్కాలు పాటించండి. ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా మీరు జీవించండి.
మరింత సమాచారం తెలుసుకోండి: