వర్షాకాలంలో ఈ లక్షణాలు కన్పిస్తే మరణమే?

Purushottham Vinay
ఇక వర్షాకాలంలో జ్వరం అనేది చాలా పెద్ద సమస్య. దీనివల్ల చాలామంది కూడా చాలా ఇబ్బందిపడుతుంటారు. ఈ సీజన్‌లో ప్రజలు జలుబు, దగ్గు ఇంకా జ్వరాలని ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే ఆరోగ్యకరమైన ఆహారంని తీసుకోవడం వల్ల కొంతవరకు నయమైనప్పటికీ కొన్నిసార్లు జ్వరం అనేది చాలా కాలం పాటు కూడా ఉంటుంది. ఇక ఈ పరిస్థితిలో మీరు దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి కొన్ని పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇక అలాంటి వాటి గురించి ఇప్పుడు పూర్తిగా ఇందులో చదివి తెలుసుకుందాం.మలేరియా అనేది వర్షాకాలంలో వచ్చే అతి సాధారణ వ్యాధి. ఆడ దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా సంభవిస్తుంది. ఈ దోమ అనేది నిలిచిన నీటిలో పెరుగుతుంది. ఇది కుట్టడం వల్ల జ్వరంతో పాటు చలి, వణుకు, చెమటలు ఇంకా అలాగే శరీర నొప్పులు కూడా ఉంటాయి. ఈ లక్షణాలు కనుక కనిపిస్తే ఆలస్యం చెయ్యకుండా వెంటనే మలేరియా పరీక్ష చేయించుకోవాలి. మలేరియాను గుర్తించడానికి ర్యాపిడ్ యాంటిజెన్ డిటెక్షన్ టెస్ట్ ని చేస్తారు.


ఇంకా అలాగే టైఫాయిడ్ అనేది కూడా ఈ వర్షాకాలంలో వచ్చే ఒక సాధారణ వ్యాధి. ఈ వ్యాధి కలుషిత ఆహారం ఇంకా అలాగే నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఈ టైఫాయిడ్‌లో పగటిపూట జ్వరం ఎక్కువగా ఉంటుంది. ఇంకా అలాగే ఉదయం పూట శరీర ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది.ఇంకా అలాగే డెంగ్యూ అనేది ఆడ ఎడిస్ దోమ కాటు వల్ల వచ్చే వైరస్ ఇన్ఫెక్షన్. ఈ వర్షాకాలంలో చాలా మంది ప్రజలు కూడా ఎక్కువగా ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య డెంగ్యూ జ్వరం. అధిక జ్వరంతో పాటు తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, కళ్ల వెనుక నొప్పి ఇంకా అలాగే శరీరంలో నొప్పి లక్షణాలుగా ఉంటాయి. ఈ సమయంలో ఖచ్చితంగా డెంగ్యూ పరీక్ష అనేది చేయించుకోవాలి. ఇది ఖచ్చితంగా అత్యంత ప్రమాదకరమైన జ్వరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: