ఒమిక్రాన్ : మ‌హారాష్ట్ర లో ఏం జ‌రుగుతోంది?

Purushottham Vinay
మహారాష్ట్రలో దాని ఒమిక్రాన్ గణనను కలుపుతూ, శుక్రవారం ఈ కొత్త కరోనా మహమ్మారి వేరియంట్‌ ఒమిక్రాన్ కి సంబంధించిన 8 కొత్త కేసులు నమోదయ్యాయి, ఇది రాష్ట్రంలో మొత్తం కేసులను 48కి తీసుకువెళ్లిందని ఆరోగ్య శాఖ తెలిపింది. "నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈరోజు ఇచ్చిన నివేదిక ప్రకారం, రాష్ట్రంలో మరో ఎనిమిది మంది రోగులు ఒమిక్రాన్ బారిన పడటం అనేది జరిగింది" అని అధికారిక ప్రకటన తెలిపింది. వీరిలో ఆరుగురు పేషెంట్లు పూణెకు చెందినవారు, ఒకరు ముంబైకి చెందినవారు, మరొకరు కళ్యాణ్-డోంబివిలీ (ముంబై సమీపంలోని ఉపగ్రహ పట్టణాలు) నుండి వచ్చారు. మొత్తం ఎనిమిది కొత్త ఒమిక్రాన్ రోగులు పురుషులు ఇంకా అది కూడా వారు 29 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు కావడం విశేషం.ఇక భారత ప్రభుత్వం కూడా 11 రాష్ట్రాలు, యుటిలలో ఇప్పటివరకు మొత్తం 101 ఓమిక్రాన్ పాజిటివ్ కేసులు కనుగొనబడటం అనేది జరిగింది. "డెల్టా సర్క్యులేషన్ తక్కువగా ఉన్న దక్షిణాఫ్రికాలో డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపడం అనేది జరిగింది.


కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరిగే డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్ అధిగమించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపారు," అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలపడం జరిగింది."గత 20 రోజులుగా కొత్త రోజువారీ కేసులు 10,000 కంటే తక్కువ నమోదయ్యాయి. గత వారంలో కేసు సానుకూలత 0.65 శాతం ఉంది. ప్రస్తుతం, దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్యకు కేరళ 40.31 శాతం తోడ్పడుతోంది" అని అగర్వాల్ తెలిపడం జరిగింది. నవంబర్ 25 వ తేదీన దక్షిణాఫ్రికా నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కి ఈ కరోనా వైరస్ మహమ్మారి కొత్త రూపాంతరం మొదటిసారిగా నివేదించబడింది. WHO ప్రకారం, ఈ సంవత్సరం నవంబర్ 9న సేకరించిన ఒక నమూనా నుండి B.1.1.529 ఇన్‌ఫెక్షన్ మొదటిసారిగా నిర్ధారించబడింది.ఇక నవంబర్ 26 వ తేదీన, దక్షిణాఫ్రికాలో కనుగొనబడిన ఈ కొత్త కరోనా వైరస్ మహమ్మారి వేరియంట్ B.1.1.529కి WHO 'Omicron' అని పేరు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: