వర్షాకాలంలో ఈ వ్యాధులతో జర జాగ్రత్త ... !

VAMSI
మండే ఎండాకాలానికి స్వస్తి చెబుతూ ఇప్పుడు వర్షాకాలం ఆరంభమయ్యే సమయం వచ్చేసింది. కొద్ది రోజుల నుండి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు మెల్ల మెల్లగా పడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడా మోస్తరు నుండి భారీ వర్షాలు పడడం మనము చూస్తున్నాము.  అయితే మొదలుకానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రావడం సహజమే. ఇందులో ముఖ్యంగా జలుబు, దగ్గు, వివిధ రకాల జ్వరాలు లాంటివి వస్తుంటాయి. అందులోనూ ఇది కరోనా సమయం కాబట్టి మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఇలాంటివి రావడం మాములే అయినప్పటికీ, మీ చుట్టూ ఉన్న వారు కరోనా లక్షణాలేమో అనుకుని పొరపాటు పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా ఇవి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి.
అయితే వర్షాకాలంలో వచ్చే వ్యాధులను ఏ విధంగా అరికట్టగలం ఇప్పుడు చూద్దాం. వర్షాకాలంలో ముఖ్యంగా వైరల్ జ్వరాలు తరచూ వస్తూ ఉంటాయి. అది కూడా 102 డిగ్రీల వరకు ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తట్టుకోలేని ఈ జ్వరం కారణంగా భరించలేని తలనొప్పి మరియు ఒళ్ళు నొప్పులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు, తద్వారా సదరు వ్యక్తి పూర్తిగా నీరసపడిపోతారట. అయితే ఇలాంటి జ్వరాలు కొద్ది రోజుల తరువాత తగ్గిపోతాయని, అలాగే కొన్ని సార్లు ప్రమాదకరమైన జ్వరాలుగా మారే అవకాశముందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. కానీ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి జ్వరాలు సైతం వైరల్ జ్వరాలుగానే పిలువబడుతాయి. ఈ జ్వరాలకు తప్పనిసరిగా తగిన చికిత్సను తీసుకోవాలి. లేదంటే ప్రాణాపాయం ఉంటుంది.
అయితే ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల వలన పుట్టే వైరస్ మన శరీరంలోని కణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ వైరస్ శ్వాస వ్యవస్థనే లక్ష్యంగా చేసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధి సోకిన వ్యక్తి ఆహారాన్ని సరిగా తీసుకోలేరు. ఇలా జ్వరాలు వచ్చిన వారికి ముందుగా శరీరం డీ హైడ్రేట్ అయిపోకుండా వేడి నీళ్లు చల్లార్చి తాగిస్తూనే ఉండాలి. సులభంగా అరిగే ఆహారాన్ని ఇవ్వడం మంచిది. వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ఆ వ్యక్తి భయపడకుండా ధైర్యం చెబుతూ ఉండాలి. ఎప్పుడైతే రోగి భాయిపడతాడో వ్యహాది ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో ఎటువంటి అజాగ్రత్తగా ఉండకుండా ఆరోగ్యాన్ని రక్షించుకోండి.
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: