క‌ని క‌రోనా : డేంజ‌ర్ జోన్లో ఆ 30 జిల్లాలు..ఏపీలో ఎన్నంటే.. ?

MADDIBOINA AJAY KUMAR
దేశంలో క‌రోనా వేగంగా విస్త‌రిస్తోంది . అయినప‌టికీ జనాలు అవ‌స‌రం లేకుండా భ‌య‌ట‌కు వ‌స్తున్నారు. డాక్ట‌ర్లు భ‌య‌ట‌కు రావ‌ద్దు క‌రోనాకు బ‌ల‌వ్వ‌ద్దు అని మొత్తుకున్న ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు . అంతే కాకుండా గ‌డిచిన రెండు వారాల్లో క‌రోనా ఉదృతి మ‌రింత పెరిగింది . తాజాగా కేంద్ర ఆరోగ్య‌శాఖ క‌రోనా విస్త‌ర‌ణ గురించి సంచ‌ల‌న విష‌యాలు భ‌య‌ట‌పెట్టింది. దేశంలో 30 జిల్లాల్లో క‌రోనా ఉదృతి ఎక్కువగా క‌నిపిస్తుంద‌ని పేర్కొంది . వాటిలో బెంగుళూరు అర్బన్‌, చెన్నై, కేరళలోని కోళికోడ్ జిల్లాలు తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. అంతే కాకుండా ఆ జాబితాలో ఏపీలోని ఏడు జిల్లాలు ఉన్న‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది . చిత్తూరు 11వ స్థానంలో, శ్రీకాకుళం 16, తూర్పుగోదావరి 17, గుంటూరు 19, విశాఖపట్నం 27, అనంతపురం 29, కర్నూలు 30వ స్థానంలో ఉన్నాయి. అంతే కాకుండా క్రియాశీల కేసులు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆరోస్థానంలో ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది .

రాష్ట్రంలో 20శాతం పైగా పాజిటివిటీ న‌మోద‌వుతుంది.తెలంగాణ‌లోనూ క‌రోనా ఉదృతి ఎక్కువగానే ఉండ‌గా కేసులు విష‌యంలో ఏపీ గ్రాఫ్ మాత్రం పైపైకి వెళుతోంది. రోజూ వారి కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న జిల్లాల్లో మొత్తం 24 జిల్లాలుండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాలుగోస్థానంలో ఉంది. బుధవారం ఒక్క రోజే  రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. 22వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ప్ర‌స్తుతం రాష్ట్రంలో 12,03,337 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అంతే కాకుండా రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ 8,374 మంది మరణించారు .  క‌రోనా ఉదృతి నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఆంక్ష‌ల‌ను విధించింది. ఉద‌యం కూడా క‌ర్ఫ్యూ విదిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. మ‌ద్యాహ్నం త‌ర‌వాత రాష్ట్రానికి వ‌స్తున్న అంత‌రాష్ట్ర వాహ‌నాల‌ను వెన‌క్కిపంపిస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో క‌ఠిన నిభంద‌న‌లు అమ‌లు చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: