హెల్త్ : రాత్రిళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా? అయితే జాగ్రత్త...
నగరాల్లో ఎక్కువగా రాత్రి పది దాటిన తర్వాత కూడా ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహారం, స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది టీవీ చూస్తూ, సెల్ఫోన్లో నెట్ సర్ఫ్ చేస్తూ చిరుతిళ్లు అతిగా లాగిస్తుంటారు. ఇలా కేవలం టైంపాస్ కోసం రాత్రిపూట తినే చిరుతిళ్లు, జంక్ఫుడ్ మెదడుపై ప్రభావం చూపుతాయని ఓ పరిశోధనలో పేర్కొన్నారు.నిద్రపోయే ముందు జంక్ఫుడ్, స్నాక్స్ తినేవారిలో మెదడు తీవ్ర ప్రభావానికి గురైనట్లు గమనించారు క్యాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి అతి త్వరగా సన్నగిల్లుతుందని ఈ పరిశోధనలో తేలింది. కాబట్టి.. మీకు కూడా ఈ అలవాటు ఉన్నట్లయితే వెంటనే మానుకోండి. లేకపోతే భవిష్యత్తులో సమస్యలు తప్పవు.నిద్రపోయే ముందు ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరగటంతో పాటు కొవ్వు పదార్థాలు పెరిగి గుండె సమస్యలు ఏర్పడతాయి. వీటితో పాటు మెదడుపై లేట్నైట్ ఫుడ్ అధిక ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలో తేలింది.