ఈ బియ్యం తింటే నిత్యం ఏ రోగాలు రావు?

Purushottham Vinay
బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి  తెలిసిందే.మధుమేహం వ్యాధితో బాధపడే వారు అలాగే బరువు తగ్గాలనుకున్న వారు వీటిని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. అయితే బరువు తగ్గాలనుకున్న వారు బ్రౌన్ రైస్ కు బదులుగా పారాబాయిల్డ్ రైస్ ను తీసుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే ఈ పారాబాయిల్డ్ రైస్ లో తక్కువ క్యాలరీలు అలాగే ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని వారు చెబుతున్నారు. ఇంకా అంతేకాకుండా సాధారణ బియ్యం కంటే కూడా ఇందులో థయామిన్ ఇంకా నియాసిన్ వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.ఈ పారాబాయిల్డ్ రైస్ ను ధాన్యంపై ఉండే పొట్టు తీయకుండా ముందుగానే ఉడికిస్తారు. ఆ తరువాత ఇందులో స్టార్చ్ జెల్ లాగా మారే దాకా ఆవిరిపై ఉడికిస్తారు. ఆ తరువాత ఈ ధాన్యాన్ని ఎండబెట్టి మర ఆడిస్తారు.ఇక ఈ బియ్యం కొద్దిగా పసుపు రంగులో ఉంటాయి. ఈ బియ్యంలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటితో అన్నం వండుకుని తినడం వల్ల ఖచ్చితంగా మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు.


ఇక ఈ బియ్యాన్ని వండుకుని తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే స్టార్చ్ ప్రోబయాటిక్ గా మారి పొట్టలో మంచి బ్యాక్టీరియా శాతాన్ని ఈజీగా పెంచుతుంది.ఇంకా అలాగే ఈ రైస్ లో గ్లైసమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. కాబట్టి షుగర్ తో బాధపడే వారు ఈ బియ్యాన్ని వండుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే పారాబాయిల్డ్ రైస్ ను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి.శరీరానికి కావల్సినంత ఐరన్ కూడా లభిస్తుంది.ఇక వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. ఇంకా అంతేకాకుండా ఈ బియ్యంలో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్స్ హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో చాలా సహాయపడతాయి.ఇక బ్రౌన్ రైస్ ఎలా అయితే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయో పారాబాయిల్డ్ రైస్ కూడా మన ఆరోగ్యానికి అంతే మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల కూడా మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: