షుగర్ పేషెంట్స్ వీటిని అస్సలు తినొద్దు?

Purushottham Vinay
మటన్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధి గ్రస్తులు దీనికి బదులుగా చికెన్, ఫిష్ వంటి వాటిని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ రావడానికి ఎక్కువగా ఆహార పదార్థాలే కారణమవుతున్నాయి. కాబట్టి కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు ఎక్కువగా ఉండి షుగర్ వ్యాధిని పెంచే వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి. సహజ సిద్దమైన మందులను ఉపయోగిస్తూ తగిన ఆహారాన్ని తీసుకుంటూ షుగర్ వ్యాధిని తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.షుగర్ వ్యాధి గ్రస్తులకు హాని చేసే మరో పదార్థం ఫ్రెంచ్ ఫ్రైస్. దీనిని తయారు చేయడానికి వాడిన పదార్థాల వల్ల, నూనెల వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరడంతో పాటు చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల షుగర్ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక సాప్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల కూడా షుగర్ వ్యాధి గ్రస్తులకు హాని కలుగుతుంది. ఇవి తాగిన వారు అధిక బరువు బారిన పడడమే కాకుండా షుగర్య వ్యాధి బారిన కూడా త్వరగా పడతారని వీటిని తాగకపోవడమే ఉత్తమం అని నిపుణులు తెలియజేస్తున్నారు.


అలాగే ఆర్టిఫిషియల్ స్వీట్ నర్స్ తీసుకోవడం షుగర్ వ్యాధి గ్రస్తులకు అంత మంచిది కాదు.ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతాయి. వీటిని ఉపయోగించడానికి బదులు మామూలు చక్కెరలను ఉపయోగించడం మంచిది.మధుమేహాన్ని పెంచే మరో ఆహార పదార్థం బంగాళాదుంప. ఇది ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి షుగర్ వ్యాధి పెరుగుతుంది. కాబట్టి వీటిని షుగర్ వ్యాధి గ్రస్తులు తీసుకోకపోవడం ఉత్తమం. అలాగే ఫ్రూట్ జ్యూస్ ను అధికంగా తాగే వారు త్వరితగతిన షురగ్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల 18 శాతం డయాబెటిస్ బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఎండుద్రాక్ష ఒకటి. వీటిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ ఎండుద్రాక్ష మధుమేహ వ్యాధి గ్రస్తులకు హానికరం.కాబట్టి వీటిని షుగర్ వ్యాధి గ్రస్తులు తీసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: