కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay
కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..ఇక రాళ్లు రాకుండా ఉండాలంటే తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. రోజంతా కూడా కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి.అలాగే మీకు కిడ్నీలో రాయి ఉంటే, అది పెరగకుండా నిరోధించడానికి అధిక ఫైబర్ ఆహారాలు తినాలి. ఇక ఇవి రాయి పెరగకుండా నిరోధిస్తాయి.కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే సిట్రిక్ యాసిడ్ ఉన్న నారింజ, నిమ్మ ఇంకా మోసాంబి మొదలైన పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. సిట్రిక్ యాసిడ్ కాల్షియం-ఆక్సలేట్ పేరుకుపోకుండా నిరోధించే శక్తిని కూడా కలిగి ఉంది, ఇది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఈజీగా నివారిస్తుంది.ఇంకా అలాగే కొబ్బరి నీళ్లలో పీచు మంచి మోతాదులో లభిస్తుంది. ఇది రాళ్లు ఉన్న వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.అలాగే పప్పుదినుసులతో కూడిన కూరగాయలు తినడం కూడా మంచిది.బేల్ పండ్లు, బేల్ ఆకులు, క్యారెట్లు ఇంకా దుంపలు వంటి మూలికలు రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి. మీరు వాటి టీ లేదా కషాయాలను కూడా తాగవచ్చు.ఇంకా అలాగే చెరకు రసం మూత్రపిండాల్లో రాళ్లను కూడా నివారిస్తుంది. ఇది రాళ్ల సమస్యలు ఉన్న వారికి చాలా మేలు చేస్తుంది.


ఇంకా ఎలాంటి పదార్థాలు తినకూడదు అంటే..ఈ రాళ్లను నివారించడానికి లేదా పెరగకుండా నిరోధించడానికి ఆక్సలేట్, సోడియం ఇంకా కాల్షియం లేనటువంటి ఆహారాన్ని తినాలి.అలాగే టమోటాలు, యాపిల్స్, బచ్చలికూర వంటి అధిక ఆక్సలేట్ పండ్లు ఇంకా కూరగాయలను నివారించండి.ఇంకా తృణధాన్యాలు, గింజలను నివారించాలి. ఇవి రాళ్లు పెరగడానికి బాగా దారితీస్తాయి.గుడ్లు, మాంసం ఇంకా చేపలకు దూరంగా ఉండాలి.అలాగే పాలతో చేసిన వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పెరుగు ఇంకా వెన్న వంటి వాటిని తక్కువగా తినాలి.అలాగే ముల్లంగి, క్యారెట్, వెల్లుల్లి, ఉల్లిపాయలలో సోడియం, ఆక్సలేట్ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీల్లో రాళ్లు ఉంటే వీటిని అస్సలు తినకుండా ఉండండి.కిడ్నీల్లో రాళ్లు ఉంటే మద్యం కూడా అస్సలు తాగకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: