పెరుగు : వామ్మో.. ఈ సమస్యలు ఉంటే అస్సలు తినొద్దు!

Purushottham Vinay
పెరుగు చాలా మంచి ఆరోగ్యకరమైన ఆహారం. కొంతమందికి పెరుగు తింటే తప్ప భోజనం చేసినంత తృప్తి ఉండదు.చాలా మంది కూడా పెరుగు తినడానికి గాని మజ్జిగ తాగడానికి గాని ఇష్టపడరు. వాళ్లకు పెరుగు తింటే చికాకుగాను ఇంకా ఇబ్బందిగాను ఉంటుంది కాబట్టి అలా చేయరు.అయితే ఇక మన ఆరోగ్యానికి పెరుగు అనేది చాలా ఉపయోగకరం అనే చెప్పాలి. ఇక పెరుగు గురించి అవగాహన లేక దాన్ని తినే ప్రయత్నం చేయరు కొంతమంది. మన శరీరానికి మేలు చేసే పదార్థాలలో పెరుగుకు చాలా ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. పెరుగు తినడంతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట.ఇందులో క్యాల్షియం అనేది పుష్కలంగా లభిస్తుంది. అదే విధంగా ఎముకలకు కూడా మేలు చేస్తుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ ను ఇంకా అధిక రక్తపోటు క్రమంగా తగ్గిస్తుందని వైద్యులు చెప్తున్నారు. పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలు కాకుండా ఇంకా చర్మానికి జుట్టుకి కూడా మంచి మేలు చేస్తుంది. కానీ కొంతమందికి పెరుగు తీసుకోవడం చాలా హానికరం అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.


కొన్ని వ్యాధులు ఉన్నవారు పెరుగు తీసుకోవడం మానేయడం చాలా మంచిది. అలాగే పెరుగు ప్రతిరోజు కూడా అవసరానికి మించి తీసుకుంటే అనేక సమస్యలు ఎదుర్కోవాలి అని హెచ్చరిస్తున్నారు. పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలకు ఇంకా దంతాలకు చాలా మేలు జరుగుతుంది. అయితే పెరుగు తీసుకోవడం కీళ్ల నొప్పులు ఉన్నవారికి అసలు మంచిది కాదు. ఆర్థరైటిస్ రోగులు పెరుగు తీసుకోవడం పూర్తిగా మానేయాలి బదులుగా క్రమంగా మజ్జిగ తాగడం వారు అలవాటు చేసుకోవాలి. ఇక పెరుగు తింటే మాత్రం నొప్పిని చాలా తీవ్రతరం చేస్తుంది. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు పెరుగు తినడం అస్సలు మంచిది కాదు. ఆస్తమా ఉన్న రోగులు పెరుగు తింటే వారి ప్రాణాల మీదకు రావొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: