షాకిచ్చిన బంగారం ధర.. జిగేల్ మన్న వెండి..!

Satvika
పసిడి ప్రియులకు భారీ షాక్..  పసిడి ధరలు నేటి మార్కెట్ లో పరుగులు పెడుతున్నాయి. నిన్న కాస్త ఊరట కలిగించిన ధరలు నేడు మాత్రం ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి.బంగారం జిగేల్ మంది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. వెండి ధర భారీగా పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదిలాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. ఇండియన్ మార్కెట్ లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి..
ఇకపోతే హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పెరుగుదలతో రూ.48,000కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 పెరుగుదలతో రూ.44,000కు పెరిగింది. ఇది నిజంగానే షాక్ ఇచ్చే వార్త అని చెప్పాలి.. బంగారం ధరలు పెరిగితే.. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి.

ఈరోజు వెండి ధరలను పరిశీలిస్తే ధరలు పెరిగాయి.బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. భారీగా పెరిగింది. వెండి ధరలో కేజీకి రూ.1500 పెరుగుదలతో రూ.73,400కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.. అంతర్జాతీయ మార్కెట్ ‌లో కూడా బంగారం ధరను పరిశీలిస్తే.. బంగారం ధర ఔన్స్ ‌కు 0.57 శాతం పెరుగుదలతో 1776 డాలర్లకు చేరింది. బంగారం ధర పైకి కదిలితే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. ఔన్స్‌కు 0.26 శాతం పెరుగుదల తో 26.03 డాలర్లకు ఎగసింది. పసిడి ధరలు పెరగడానికి, తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మరి రేపు ఇండియన్ మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: