తక్కువ ధరకే బంగారాన్ని వేలం వేస్తున్న ఆ ఫైనాన్స్ కంపెనీ...!

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బంగారం కొనాలని అనుకుంటున్నారా? తక్కువ  పసిడి కొనాలని ఆలోచన చేస్తున్నారా? అయితే మీకోసం ఒక బంపర్  ఆఫర్ అందుబాటులో ఉంది. పసిడి  వేలం జరగబోతోంది. ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ  ముత్తూట్ మిని ఫైనాన్షియర్స్  మీకు తక్కువ ధరకే బంగారాన్ని  కొనే అవకాశాన్ని కల్పిస్తోంది.మరి ఇంకెందుకు ఆలస్యం కోనేసేయండి...

ప్రస్తుతం దేశ రాజధాని అయిన ఢిల్లీలో  వేలం జరుగుతుంది. అక్కడ ఒక్కో సెంటర్‌లో వేలం ఒక్కో రోజు జరుగుతుంది. డిసెంబర్ 23 నుంచి వేలం ఉంటుంది. బంగారు ఆభరణాలు పెట్టి లోన్ తీసుకున్న వారు ఆ రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోతే.. అప్పుడు ఆ బంగారాన్ని వేలం వేస్తారు. వచ్చిన డబ్బును రుణ మొత్తంలోకి జమ చేసుకుంటారు.
ఇక ఈ క్రమంలో  ముత్తూట్ మిని ఫైనాన్షియర్స్ కూడా ఇలాగే రుణ మొత్తం చెల్లించని వారి బంగారు ఆభరణాలను విక్రయించేందుకు రెడీ అవుతోంది. ఇలా వేలంలో పాల్గొనడం వల్ల తక్కువ ధరకే బంగారం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో లేదు. అయినా సరే  ఇబ్బంది ఏమీ ఉండదు.

మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఎవరైనా  తెలిసిన వారు ఢిల్లీలో ఉంటే.. వాళ్ల ద్వారా  వేలంలో బంగారం సొంతం చేసుకోవచ్చు. మీరు అక్కడున్న మీకు తెలిసిన  వారికి చెప్పి వేలంలో పాల్గొనమనాలి. ఇలా మీరు తక్కువ ధరకే బంగారాన్ని సొంతం చేసుకోనే అవకాశం పుష్కాలంగా వుంది. ఇంకో విషయం ఏమిటంటే  మీకు అక్కడ ఢిల్లీలో తెలిసిన వారు మీకు మంచి ఆప్తులు తెలిసిన వారు బాగా నమ్మకస్తులై ఉండాలి. ఆ విషయాన్ని శ్రద్ధగా గుర్తు పెట్టుకోండి...లేదంటే మీరు చాలా ఇబ్బంది  పడాల్సి ఉంటుంది. కాగా ఈ  వేలంలో పాల్గొనే వారు పాన్ కార్డు తప్పనిసరిగా  ఇవ్వాలి ఉంటుంది. ముందుగానే కొంత మొత్తం ఎమౌంట్  డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఈ సువర్ణ అవకాశన్ని మిస్ చెయ్యకుండా బంగారం కొనుగోలు చెయ్యండి...ఇలాంటి మరెన్నో బంగారానికి సంబంధించిన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: