భారీగా పెరిగిన బంగారం ధర.. పసిడి బాటలోనే వెండి కూడా..!

Suma Kallamadi
దేశీయ మార్కెట్ లో తగ్గతూ వచ్చిన బంగారం ధర స్వల్పంగా పెరుగుతోంది. లాక్ డౌన్ లో ఆకాశాన్ని తాకిన ధరలు అన్ లాక్ ప్రక్రియ కొనసాగడంతో బంగారం ధరలు మెల్లిగా తగ్గతూ వచ్చి మళ్లీ పెరిగింది. కానీ ఈ సారి వెండి ధర రికార్డు స్థాయిలో పెరిగింది.
 
హైదరాబాద్ మార్కెట్ లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. మంగళవారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 పెరగడంతో ధర రూ.54,200కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.180కి పెరగడంతో రూ.49,720 కి చేరింది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర తిరిగి పెరుగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,200, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,720కి చేరింది. విశాఖ పట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,200. 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,720 గా ఉంది.
దేశీయ మార్కెట్ లో పసిడి ధర స్వల్పంగా పెరిగినా వెండి ధర మాత్రం పరుగులు తీస్తోంది. మార్కెట్ కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ఏకంగా రూ.2100 పెరగడంతో ధర రూ.68,700 లకు చేరింది.భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు కొన్ని సార్లు పెరుగుతూ.. మరికొన్ని సార్లు తగ్గుతూ ఉంటుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70 పెరగడంతో ధర రూ.55,000కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 పెరగడంతో రూ.50,400కు చేరింది.
రాజధానిలో కూడా వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండిధర రూ.2100 పెరగడంతో రూ.68,700 కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం వల్ల ధరలు పెరగుదల, తగ్గుదలకు కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరియు అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల వల్ల పసిడి స్థిరంగా ఉండటానికి దోహదపడుతున్నాయని, బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధర పెరుగుతోంది నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: