కస్టమర్లకు శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధర !
- దేశీయ మార్కెట్ లో బంగారం ధర రోజురోజుకు భారీగా తగ్గుతూ వస్తోంది. లాక్ డౌన్ లో ఆకాశాన్ని తాకిన ధరలు అన్ లాక్ ప్రక్రియ కొనసాగడంతో బంగారం ధరలు మెల్లిగా తగ్గతూ వస్తున్నాయి. వెండి ధర కూడా పసిడి బాటలో నడుస్తోంది.
హైదరాబాద్ మార్కెట్ లో కూడా పసిడి ధర కూడా భారీగా తగ్గుతూ వస్తోంది. బుధవారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.390 తగ్గడంతో ధర రూ.53,660కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.290కి తగ్గడంతో రూ.49,190 కి చేరింది. గత కొద్ది రోజులుగా బంగారం ధర భారీగా తగ్గుతూ వస్తోంది. దీంతో పసిడి ప్రియులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,660, 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,190కి చేరింది.
ఇక కేజీ వెండి ధర కూడా తగ్గింది. 10 గ్రాముల వెండిధర రూ.655 తగ్గడంతో రూ.65,550 కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం వల్ల ధరలు పెరగుదల, తగ్గుదలకు కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరియు అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల వల్ల పసిడి స్థిరంగా ఉండటానికి దోహదపడుతున్నాయని, బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధర పెరుగుతోంది నిపుణులు పేర్కొంటున్నారు.