ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు!కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ తాజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్ ని రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256 ని జారీ చేసింది.గత వైసీపీ ప్రభుత్వంలో 6,100 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి పార్టీలు భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు చంద్ర బాబు నాయుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్సీపై చెయ్యడం జరిగింది.ఇక ఈ నేపథ్యంలో పాత డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. నేడో, రేపో మొత్తం 16,347 పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ జారీకానుంది.మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేయగా, విధివిధానాలపై మంత్రి నారా లోకేశ్ కూడా సంతకం పెట్టారు. ఈమధ్య జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కు ఆమోదం లభించింది.


దీంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ కి లైన్ క్లియర్ అయ్యింది. ఇప్పటికే టెట్ ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడో, రేపో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ని కూడా విడుదల చేయనుంది. మెగా డీఎస్సీ కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీతో పాటు టెట్‌ పరీక్షను కూడా నిర్వహించనున్నారు.ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలోకి వచ్చి టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్తను చెప్పిన సంగతి తెలిసిందే. మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం కూడా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ కూడా కసరత్తు  చేసింది. దీనికి సంబంధించి కీలక ప్రకటన కూడా చేసింది. ఇక మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాల్స్ 52 ఇంకా వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: