తల్లిని వేధించిన కొడుకు కోడలుకి గుణపాఠం?

Purushottham Vinay
తల్లిదండ్రులని నిజంగా చక్కగా చూసుకునేవాడే నిజమైన విద్యా వంతుడు. కానీ ఈరోజుల్లో తల్లి దండ్రులు వృద్ధాప్యంలోకి రాగానే వాళ్లను చాలా నిర్లక్ష్యం చేసే పిల్లలు చాలా మంది ఉంటారు. కొడుకు-కోడలు ఇంకా కూతురు-అల్లుడు తల్లిదండ్రుల్ని అస్సలు పట్టించుకోరు.ఈరోజుల్లో వృద్దాప్యంలో ఉన్న తల్లి దండ్రుల్ని కనీసం మనుషుల్లా కూడా చూడట్లేదు జనాలు.చూడకపోతూ చూడకపోయారు కానీ .. వారిపై చాలా రకాలుగా దాడులు చేస్తూ, అనేక రకాల వేధింపులకు కూడా పాల్పడుతుంటారు. అలాంటి వారికి గుణపాఠం నేర్పేలా ఇప్పుడు తాజా తీర్పు వెలువడింది.వృద్ధాప్యంలో ఉన్న తల్లిని వేధింపులకు గురి చేసిన కొడుకు-కోడలికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సూర్య తేజ ఈ మేరకు తాజా ఆదేశాలను జారీ చేశారు. పుల్లూరి నాగమణి అనే వృద్ధురాలిని ఆమె కొడుకు వెంకన్న ఇంకా కోడలు రేవతి అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారు. కనీసం ఆమె సంరక్షణ కూడా చూడలేదు.


అందువల్ల దీనిపై ట్రిబ్యునల్ కోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో వెంకన్న-రేవతి నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపించింది. దీంతో కోర్టు వారికి జైలు శిక్ష విధించింది.ఇక 2007, పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఇద్దరికీ కూడా రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కొడుకు-కోడలు ఉంటున్న ఇంటిని కూడా స్వాధీనం చేసుకుని, తల్లి నాగమణికి ఆ ఇల్లు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఇంటికి సంబంధించి ఒక పోర్షన్ ని అద్దెకిచ్చి, ఆ అద్దె ద్వారా నాగమణి జీవనం గడిచేలా చూడాలని కూడా ఆదేశించింది.ఒకవేళ తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యతను ఉల్లంఘిస్తే, శిక్ష తప్పదని సబ్ కలెక్టర్ సూర్య తేజ హెచ్చరించడం జరిగింది.ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ఎవరైనా తమ తల్లి దండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వారికి కూడా ఇలాంటి శిక్షలు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: