ఇక ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అందిస్తున్న విద్యా కానుక కిట్లను ఇంకా మంచి నాణ్యతతో అందించేందుకు విద్యాశాఖ అధికారులు ఇప్పుడు బాగా కసరత్తులు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. మొత్తం రూ.1,042.53 కోట్ల వ్యయంతో 40 లక్షల మందికి పైగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందించేలా ముమ్మరంగా ఏర్పాట్లు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. ఇక మరింత మన్నికతో కూడిన నాణ్యమైన బ్యాగ్లు అలాగే బూట్లను అందించనున్నారు. ఇంకా అలాగే ప్లెయిన్ యూనిఫామ్ కాకుండా.. చెక్స్ ఉండే రంగులతో కూడిన క్లాత్ ని కూడా అందించనున్నారు. పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ ముద్రణ పనులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఈ నెల 24వ తేదీ నుంచి జిల్లా పాయింట్లకు ఈ పంపిణీ అనేది మొదలవుతుంది. ఇక స్కూళ్లు తెరిచే రోజే వీటిని విద్యార్థులకు అందించనున్నారు.ఈ విద్యా కానుక ద్వారా అందించే ప్రతి ఒక్క వస్తువు నాణ్యతను స్వయంగా పరిశీలిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
స్థానిక మార్కెట్లో సుమారు రూ.650 విలువ చేసే నాణ్యమైన బ్యాగులను కూడా సరఫరా చేస్తున్నారు. యూనిఫామ్కి సంబంధించి బాలికల టాప్ ఇంకా అలాగే బాలుర షర్ట్లను ప్లెయిన్ క్లాత్ నుంచి చెక్స్ (గడులు) రూపంలోకి మార్పు చేశారు. ఇంకా అలాగే బూట్లు మరింత షైనింగ్ ఉండేలా చర్యలు చేపట్టారు.ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్కి గతంలో లాగా నామినేషన్ ప్రాతిపదికన అప్పగించారు. 1 నుంచి 9వ తరగతి దాకా బైలింగ్వుల్ పాఠ్య పుస్తకాలు ప్రచురిస్తున్నారు. అలాగే అన్ని మీడియం పాఠశాలలకు బైలింగ్వుల్ పుస్తకాలు అందించనున్నారు.ఇక జగనన్న విద్యా కానుక ద్వారా అందచేసే కిట్లలో అసలు నాణ్యత అనేది తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు ఎప్పటికప్పుడు ప్రతి దశలో కూడా చెకింగ్ లు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టారు.