గుడ్ న్యూస్: కోల్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు!

Purushottham Vinay
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన కోల్ ఇండియా (Coal India) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత వున్న అభ్యర్థులు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.ఇక ఈ మేరకు కోల్ ఇండియా సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Coal india Job Notification) విడుదల చేయడం జరిగింది. ఇందులో మొత్తం కూడా 1050 మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు విడుదల అయిన ప్రకటనలో పేర్కొన్నారు. మైనింగ్, సివిల్ ఇంకా అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యనికేషన్ సిస్టం అండ్ EDP విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఇంకా అలాగే సంబంధిత విభాగాల్లో గేట్ స్కోర్ (GATE 2022) కలిగిన అభ్యర్థులు ఇక ఈ ఖాళీలకు (Jobs) అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ అనేది జూన్ 23 వ తేదీన ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జులై 22 వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు.ఇక వీటిని అప్లై చేసుకోవడానికి అర్హత ఇంకా అలాగే ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.ఇక అభ్యర్థులు సాధించిన గేట్ స్కోర్ ఆధారంగానే ఎంపిక అనేది ఉంటుంది.

ఇక విభాగాల వారీగా ఖాళీల వివరాలు..


మైనింగ్-699
సివిల్-160
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్-124
సిస్టం అండ్ ఈడీపీ-67
మొత్తం:1050


Mining: ఈ విభాగంలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మైనింగ్ లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఖచ్చితంగా చేసి ఉండాలి. ఇంకా కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి.


CIVIL: సివిల్ ఇంజనీరింగ్ లో మొత్తం 60 శాతం మార్కులతో బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.


ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్: ఇక ఈ విభాగంలో బీటెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.


సిస్టం అండ్ ఈడీపీ: వీటికి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన వారు లేదా ఎంసీఏ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 60 శాతం మార్కులు పొంది ఉండాలి.


వయస్సు: అభ్యర్థుల గరిష్ట వయస్సు వచ్చేసి 30 ఏళ్లలోపు ఉండాలి.


వేతనం: ఇక ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు కూడా వేతనం అనేది ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: