టెన్త్ అర్హతతో పోస్టల్ లో ఉద్యోగాలు!

Purushottham Vinay
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్‌ విభాగం దేశవ్యాప్తంగా కూడా ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది.కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత కలిగిన అభ్యర్థులు ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.ఇక పూర్తి వివరాల్లోకి కనుక వెళ్లినట్లయితే..ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38926 ఖాళీలలను భర్తీ చేయనున్నారు. అలాగే భర్తీ చేయనున్న పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలను గనుక పరిశీలిస్తే తెలంగాణలో 1226 ఖాళీలు ఇంకా అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 1716 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వివరాలకు సంబంధించి బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(ఏబీపీఎం) ఇంకా అలాగే డాక్‌ సేవక్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.అలాగే అభ్యర్ధుల అర్హతల విషయానికి కనుక వస్తే ఖచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషతోపాటు ఇంకా సైకిల్‌ తొక్కడం కూడా వారికి వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. వీటికి ఎంపికైన అభ్యర్ధులకు టైం రిలేటెడ్‌ కంటిన్యూటీ అలవెన్స్‌ ప్రకారం వారికి జీతభత్యాలు చెల్లిస్తారు.


బీపీఎం పోస్టులకు నాలుగు గంటల టీఆర్‌సీఏ సబ్‌ ప్లాన్‌ కింద నెలకు రూ.12000 జీతం చెల్లిస్తారు. ఏబీపీఎం ఇంకా అలాగే డాక్‌సేవక్‌ పోస్టులకు నాలుగు గంటల టీఆర్‌సీఏ సబ్‌ ప్లాన్‌ కింద నెలకు రూ.10000 వేతనంగా చెల్లిస్తారు.అలాగే ఎంపిక విధానానికి సంబంధించి పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. మెరిట్‌ లిస్ట్‌ ద్వారా తుది ఎంపికను నిర్వహిస్తారు. ఇక అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ వచ్చేసి మే 2,2022 నుండి స్టార్ట్ అవుతుంది. ఇక అలాగే దరఖాస్తులకు చివరి తేది వచ్చేసి జూన్ 5,2022గా నిర్ణయించారు.దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://indiapostgdsonline.gov.in ఒకసారి పరిశీలించగరలు.ఇక ఆసక్తి ఇంకా అలాగే అర్హతలు కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: