సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి విద్యార్థుల పరీక్షలను ఇప్పుడు మూడు గంటల పాటు నిర్వహించాలని అన్ని పరీక్షా కేంద్రాల ఇన్ఛార్జ్లను ఆదేశించింది. అంతకుముందు, మొదటి ప్రయోగాత్మక పరీక్ష కోసం ఒకటిన్నర గంటలు సెట్ చేయబడింది.
ఫిబ్రవరి 24న ప్రాక్టికల్ పరీక్ష కోసం బోర్డు మార్గదర్శకాలను జారీ చేసింది,
మార్చి 8న సవరించబడింది. CBSE పట్లీపుత్ర సహోదయ మాజీ కోశాధికారి - A K నాగ్ ప్రకారం, విద్యార్థులు ప్రశ్నలను మరింత మెరుగ్గా పరిష్కరించగలుగుతారు కాబట్టి ఇది విద్యార్థులకు సులభతరం చేస్తుంది. 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షను
మార్చి 2 నుంచి నిర్వహిస్తున్నారు.మెయిన్ పరీక్షకు ముందు 10 రోజుల పాటు ప్రాక్టికల్ పరీక్షను తప్పనిసరి చేయాలని బోర్డు ఆదేశించింది. అదే సమయంలో, CBSE యొక్క 12వ సైద్ధాంతిక పరీక్ష ఏప్రిల్ 26 నుండి నిర్వహించబడుతుంది. పదవ తరగతి అలాగే 12వ తరగతి టర్మ్ 2 పరీక్షల తేదీలను సి బి ఎస్ సి విడుదల చేయడం అనేది
గుడ్ న్యూస్ అనే చెప్పాలి.ఇక పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 26వ తేదీ నుంచి 2022 న స్టార్ట్ అవుతాయని స్పష్టం చేయడం అనేది జరిగింది.
ఇక అలాగే మే 24వ తేదీన ఈ పరీక్షలు కంప్లీట్ అవుతాయని సిబీఎసి షెడ్యూల్లో ప్రకటించడం అనేది జరిగింది.అలాగే ఇక 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ మాసంలో 26వ తేదీ 2022న స్టార్ట్ కానున్నాయి అని తెలిపడం జరిగింది.ఇక ఈ పరీక్షలు
జూన్ 15వ తేదీన పూర్తి కానున్నట్లు షెడ్యూల్ లో వివరించడం జరిగింది. ఇక ఈ తేదీలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులందరూ కూడా పరీక్షలకు సన్నద్ధం కావాలని..
కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. ఇక ముందు ఎవరిని కూడా పాస్ చేయబోమని స్పష్టం చేయడం అనేది జరిగింది.అలాగే
కరోనా వైరస్ మహమ్మారితో స్కూల్లు మూతపడటంతో పరీక్షల తేదీల మధ్య గ్యాప్ అనేది పెంచడం జరిగింది. ఇక అలాగే అన్ని పరీక్షలు ఉదయం పూట 10:30 గంటల నుంచి మధ్యాహ్నం పూట 12:30 గంటల వరకు కూడా జరగనున్నాయి.కాబట్టి టర్మ్ 1 పరీక్షలు ఇప్పటికే పూర్తయిన సంగతి కూడా తెలిసిందే.