తెలంగాణ : బడికి దూరంగా విద్యార్థులు..?

Purushottham Vinay
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడికి దూరంగా ఇంకా వేలాది మంది విద్యార్థులు కనిపిస్తున్నారు. పుస్తకం అనేది పట్టకుండా అసలు అక్షర జ్ఞానానికి చాలా దూరంగా ఉంటున్నారు.మరీ ముఖ్యంగా చెప్పాలంటే హైస్కూల్‌ స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్‌ రేటు అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇది ప్రాథమిక పాఠశాలలు ఇంకా అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల కంటే ఉన్నత పాఠశాలల్లోనే డ్రాపౌట్‌ రేటు అనేది చాలా ఎక్కువగా ఉంది. హైస్కూల్‌ చదివే విద్యార్థులే ఎక్కువగా బడిని మధ్యలో మానేసినట్లుగా సమాచారం అనేది తెలుస్తోంది.ఇక తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ తాజాగా రిలీజ్ చేసిన తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌-2021లో ఈ గణాంకాలు వెల్లడించడం అనేది జరిగింది. ఇక 2019-20 నాటికి ఉన్నత పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా మొత్తం డ్రాపౌట్‌ రేటు 12.29 శాతంగా నమోదైంది. తెలుస్తున్న నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2019-20లో మొత్తం 40,898 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 20,752 ప్రాథమిక పాఠశాలలు (1 నుంచి 5 తరగతులు) , ఇంకా 7,471 ప్రాథమికోన్నత (6 నుంచి 8), 11,921అలాగే ఉన్నత పాఠశాలలు (9, 10), ఇంకా 754 హైయ్యర్‌ సెకండరీ స్కూల్స్‌ (11, 12) ఉన్నాయి.



హైస్కూల్‌ లెవెల్ లో వివిధ రకాల కారణాలతో మధ్యలో చదువు మానేసి బడి బయట ఉన్న విద్యార్థుల్లో 29.49 శాతంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్టచివరి ప్లేస్ లో ఉంది. ఇక అలాగే ఆ తర్వాత 25.69 శాతంతో జోగులాంబ గద్వాల జిల్లా ఉండగా, సంగా రెడ్డి-23.42 శాతం, మహబూబాబాద్‌-23.09 శాతం, వరంగల్‌-21.64 శాతం, ములుగు-21.59, వికారా బాద్‌-20.68 శాతం, యాదాద్రి భువనగిరి- 19.77 శాతం, జగిత్యాల్‌-19.40 శాతం, మెదక్‌- 19.23 శాతంతో ఈ జిల్లాలు ఇక చివరి పది స్థానాల్లో నిలిచాయి. అయితే ఆదిలాబాద్‌, హన్మకొండ ఇంకా అలాగే కరీంనగర్‌ జిల్లాలో మాత్రం సున్నా శాతంగా విద్యార్థుల డ్రాపౌట్‌ అనేది నమోదైంది. ఇది అక్కడి విద్యాధికారులు ఇంకా అలాగే ఉపాధ్యాయుల కృషికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కనుక చూసుకుంటే హైదరాబాద్‌ జిల్లాలో 3.59 శాతం, రంగారెడ్డి జిల్లాలో 8.38 శాతం, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 18.67 శాతంగా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్‌ నమోదవ్వడం అనేది జరిగింది. మిగితా జిల్లాల్లోనూ 18 శాతం వరకు డ్రాపౌట్‌ అనేది ఉంది. ఇక ఇదిలా ఉంటే ప్రాథమిక విద్యాలో డ్రాపౌట్‌ రేటు సున్నాగా నమోదవ్వడం అనేది గమనార్హం. అలాగే ప్రాథమికోన్నత పాటశాలల్లోనూ 0.06 శాతంగా నమోదవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: