పాలిటెక్నిక్ క్వశ్చన్ పేపర్లు లీక్... విద్యార్థుల భవిష్యత్తుతో ఈ ఆటలేంటి ?

VAMSI
మన జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడాలి అనుకుంటే బాగా చదువుకోవాలి. అలాంటపుడు విద్యార్థులకు పరీక్షలు అనేవి ఎంత ముఖ్యమో తెలిసిందే. పరీక్షల ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి అన్న విషయం తెలిసిందే. ఏ మాత్రం తారుమారయినా లేక గందరగోళం అయినా జీవితాలే నాశనం అయ్యే అవకాశం. అందుకే పరీక్షలను ప్రభుత్వాలు చాలా కట్టుదిట్టంగా మరియు ప్రణాళికా బద్ధంగా ప్లాన్ చేస్తాయి. అయినా సరే కొన్ని చోట్ల తప్పులు, పొరపాట్లు దొర్లుతుంటాయి. ఇపుడు తాజాగా ఇలాంటి చిక్కొచ్చి పడింది. తెలంగాణ లో జరిగిన ఒక తప్పిదంతో మొత్త ఆ రాష్ట్రం లోని పాలిటెక్నిక్ విద్యార్థులు అయోమయంలో పడ్డారు.

ఇంతకీ అసలు విషయం ఏమిటో చూద్దాం. తెలంగాణ లో ఫిబ్రవరి 8 నుండి పాలిటెక్నిక్ పరీక్షలు జరుగుతున్నాయి. కాగా అక్కడ ప్రశ్నాపత్రం లీక్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణలోని హైదరాబాద్ లో శివారు బాటసింగారు స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజీ లో పాలిటెక్నిక్ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యింది. ఈ విషయాన్ని గుర్తించిన బోర్డ్ అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ కాలేజీలో what's యాప్ ద్వారా ప్రశ్నపత్రం ఇతరులకు లీక్ అయినట్లు వారు గుర్తించారు. దాంతో ఈ అంశం పై  బోర్డ్ అధికారులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి కేసు రిజిష్టర్ చేశారు.

ప్రస్తుతం ఆ కాలేజీ లో క్వశ్చన్ పపేర్ లీకేజీ పై దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తులో అసలు ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం ఇదే మొదటి సారా ? ఏయే పేపర్లు లీకయ్యాయి ? ఎవరెవరికి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి అన్న వివరాలు రాబట్టేందుకు పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. వీలైనంత త్వరగా ఈ కేసును పరిష్కరిస్తామని తెలిపారు. కానీ నేడు ఇలా ప్రశ్న పత్రాలు లీకవ్వడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు ఏమి కావాలి. ఎందుకు ఇలా లీకు రాయుళ్లు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: