ఆఫ్గాన్ పరిస్థితి : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. మధ్యలో పరదా..!

MOHAN BABU
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ ల పాలనకు  అద్దంపట్టే ఓ ఘటన తాజాగా చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. ముష్కరుల అక్రమణలతో యుద్ధ వాతావరణం నెలకొన్న ఆఫ్గాన్ లో ఇప్పుడిప్పుడే రోజువారి కార్యకలాపాలు తిరిగి మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. తాజాగా కొన్ని ప్రావిన్స్ లలో విశ్వవిద్యాలయాలు ఓపెన్ చేశారు. దీనితో విశ్వవిద్యాలయాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోకుండా తరగతిగదిలో పరదాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను స్థానిక విలేకరులు కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

 ప్రజా ప్రభుత్వం నుంచి ముష్కరుల చేతిలో కి వెళ్ళిన ఆఫ్ఘనిస్తాన్ లో భారీ మార్పులే చోటు చేసుకుంటున్నాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని చెప్పుకుంటూ వచ్చిన తాలిబన్లు చేతల్లో మాత్రం తమ సహజ సిద్ధ అరాచక వైఖరినే  కొనసాగిస్తున్నారు. తాలిబన్ ఎడ్యుకేషన్ అథారిటీ విద్యాసంస్థలకు ఇటీవల కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు యూనివర్సిటీలకు వెళ్లే మహిళలు తప్పనిసరిగా బుర్కా, నిఖాబ్ ధరించాలని తాలిబన్లు ఆదేశించారు. వేర్వేరు తరగతి గదుల్లో బోధించాలని చెప్పారు. అది కుదరకపోతే కనీసం వారి మధ్య కర్టెన్ వేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అంతేగాక అమ్మాయిలకు పురుషులు విద్యాబోధన చేయరాదని స్పష్టం చేసింది. అయితే ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వయసులో పెద్దవారు అయిన పురుష టీచర్లు వారికి బోధించాలని తెలిపారు. ఇక తరగతులు పూర్తయిన తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే సారి బయటకు వెళ్లకూడదట. ఒకే సమయంలో వెళ్తే బయట, వారు మాట్లాడుకునే అవకాశం ఉంటుందని దాని పైన ఆంక్షలు విధించారు. ముందు అబ్బాయిలంతా బయటికి వెళ్లిపోయిన తర్వాత అమ్మాయిలను పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈవిధంగా ఆప్ఘనిస్థాన్లో  తాలిబన్లు తమ అరాచక పాలనను కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం  అబద్ధం మొత్తం వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: