రైల్వేలో ఉద్యోగం చేయాలని అనుకునేవారికి అదిరిపోయే న్యూస్ ను చెప్పింది భారత రైల్వే.. రైల్వే లో ఖాళీగా ఉన్న పోస్టుల ను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. గతంలో విడుదల చేసిన పోస్టులకు మంచి స్పందన రావడం తో ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసారు.. దేశ ఆర్థిక రాజధాని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న వెస్ట్రన్ రైల్వేలో ఖాళీగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాల ని సూచించింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3591 అప్రెంటిస్ పోస్టుల ను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల కు పదో తరగతి, ఇంటర్తో పాటు ఐటీఐ పాసైన అభ్యర్థులు అర్హుల ని తెలిపింది. డిప్లొమా చేసిన వారు అప్లయ్ చేసుకోవడానికి వీల్లేదని పేర్కొంది. ఎంపికైనవారికి ఏడాది పాటు శిక్షణ అందించనున్నారు.
మొత్తం పోస్టులు: 3591
అర్హత: పదో తరగతి, ఇంటర్ తర్వాత ఐటీఐ పూర్తి చేసి ఉండాలి..
అభ్యర్థులు 2021, జూన్ 24 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థుల కు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: మే 25
దరఖాస్తుల కు చివరితేదీ: జూన్ 24
వెబ్సైట్: https://www.rrc-wr.com
ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన నిరుద్యోగులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి.. కరోనా పెరుగుతున్న నేపథ్యం లో రైల్వే మరిన్ని సేవలను అందుబాటు లోకి తీసుకొచ్చింది.. వాటిని వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేసింది..