హెరాల్డ్ ఎడిటోరియల్: మోడి నుండి జగన్ కు ఊహించని మద్దతు.. ఎల్లోబ్యాచ్ కు షాక్
కేంద్రం దాఖలు చేసిన తన అఫిడవిట్ లో ఏపికి ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని స్పష్టంగా చెప్పింది. విభజన చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం ఏ క్యాపిటల్ అనేది లేదని ఏపికి ఎన్ని రాజధానులైనా పెట్టుకోవచ్చని చెప్పేసింది. అలాగే హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతే రాజధానిగా ఉండాలని కూడా విభజన చట్టంలో ఎక్కడా లేదని సూటిగా, స్పష్టంగా చెప్పేసింది. సరే గతంలో చెప్పినట్లుగానే తాజా అఫిడవిట్లో కూడా రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమే అని కూడా గుర్తుచేసింది. రాజధాని అంశంలో కేంద్రం ఎటువంటి జోక్యం చేసుకోదని కూడా క్లారిటి ఇచ్చేసింది. మూడు రాజధానుల అంశం చివరకు ఏమవుతుందో ఎవరు చెప్పలేరు కానీ కేంద్రం మాత్రం జగన్ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ఇస్తునే ఉంది. రాజధానుల విషయం, రాజధానికి హైకోర్టుకు ముడిపెట్టి చంద్రబాబు+ఎల్లోమీడియా చేస్తున్న అడ్డుగోలు వాదనకు కేంద్రం తన తరపున స్పష్టమైన సమాధానమే ఇచ్చేసింది.
కేంద్రం దాఖలు చేసిన తాజా అఫిడవిట్ తర్వాత ఏ క్యాపిటల్ అని, హైకోర్టు ఉంది కాబట్టి అమరావతే రాజధానిగా ఉండాలనే పిచ్చి వాదన కోర్టులో నిలవదు. రాజధాని వివాదంలో ఇప్పటికే కేంద్రం రెండుసార్లు తన వాదనను అఫిడవిట్ రూపంలో చెప్పేసింది. అయితే ఎవరో ఒకళ్ళు కేసు వేస్తున్నప్పుడల్లా హై కోర్టు నోటీసు ఇస్తోంది. కాబట్టి నోటీసందుకున్న ప్రతిసారి కేంద్రం తన అఫిడవిట్ ను దాఖలు చేయాల్సొస్తోంది. ఏదేమైనా జగన్ ఊహించని రీతిలో కేంద్రం నుండి సంపూర్ణ మద్దతు అందుతుండటం నిజంగా పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. అమరావతిని రాజధానిగా అప్పట్లో చంద్రబాబు ఎంపిక చేసింది రాజకీయపరమైన నిర్ణయమనే చెప్పాలి. కాబట్టి ఇపుడు జగన్ చేస్తున్నది కూడా అలాంటి పనే అనటంలో సందేహం లేదు. అప్పట్లో తాను అమరావతిని ఎంపిక చేయటానికి చంద్రబాబు ఎలా సమర్ధించుకుంటున్నాడో ఇపుడు జగన్ కూడా అలానే సమర్ధించుకుంటున్నాడు.