హెరాల్డ్ ఎడిటోరియల్ : అంతర్వేది రథం దగ్దంలో రాజుగారి గోలేంటి ? జగన్ను ఎందుకు లాగుతున్నాడు ?
ఇదే విషయమై ఎంపి మాట్లాడుతూ తొందరపాటు వ్యాఖ్యలు చేసేశాడు. రథం తగలబడిన విషయానికి మతం రంగును కూడా పులిమేశాడు. అంటే జగన్ను నేరుగా క్రిస్తియన్ అని చెప్పకుండానే రథం కాలిపోయిన విధానాన్ని చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయంటూ ఆరోపించాడు. ఒకేసారి రథం క్రింద నుండి పై దాకా తగలబడిన విధానం చూస్తుంటే రాజుగారికి కుట్రకోణం దాగుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయట. షార్ట్ సర్క్యూట్ వల్ల మాత్రం రథం తగలబడలేదని రాజుగారు కుండబద్దలు కొట్టకుండానే నిర్ధారించేశాడు. ఎంపి అనుమానాలకు, నిర్ధారణకు ఆధారాలేమిటి అని అడిగితే మాత్రం అన్నీ విచారణలోనే తేలుతాయని దబాయించాడు.
రథం తగలబడటంలో మతపరమైన కుట్ర దాగుందని ఆరోపించిన ఎంపి దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండానే అలాంటి ఆరోపణలు ఎలా చేస్తాడు ? హిదువుల విశ్వాసాలను దెబ్బతీయటం మంచిది కాదని హితవు కూడా చెప్పేశాడు. తాను చెప్పిన హితవు ఎవరిని ఉద్దేశించో ఎంపి స్పష్టం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని డిజిపితో మాట్లాడి నిందుతులెవరైనా, ఏ మతస్తులైనా సరే వాళ్ళపై యాక్షన్ తీసుకవాలంటూ ఎంపి చేసిన డిమాండ్ చేయటం వెనుకే అసలైన కుట్ర కోణం ఉందని వైసిపి వర్గాలు ఎదురుదాడి మొదలుపెట్టాయి. ఎంపి ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా తెలిసిపోతోంది. జగన్ క్రిస్తియన్ అని జనాలకు పదే పదే గుర్తు చేయటమే ఎంపి టార్గెట్ గా తెలిసిపోతోంది.