టెన్త్ క్లాస్ పరీక్షలకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం?

Purushottham Vinay
టెన్త్ క్లాస్ పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయంని తీసుకుంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి టెన్త్ క్లాస్ లో 6 పేపర్ల విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.ఇక ప్రతి సబ్జెక్టుకు కూడా ఒక పేపర్‌ చొప్పున కేవలం ఆరు పరీక్షలే నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం  అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే గతంలో ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు ఇంకా హిందీకి ఒక పేపర్‌ చొప్పున మొత్తం 11 పేపర్లకు పరీక్షలు నిర్వహించేవారు.అయితే కరోనా వైరస్ వ్యాపించిన నేపథ్యంలో వాటిని ఏడింటికి కుదించారు. అయితే సైన్స్ విషయంలో మాత్రం భౌతిక శాస్త్రం ఇంకా అలాగే జీవశాస్త్రాలకు రెండు వేర్వేరు పేపర్లుతో పరీక్ష నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ఈ రెండు సబ్జెక్టుల ప్రశ్నలను రెండు వేర్వేరు విభాగాలుగా ఒకే ప్రశ్న పత్రంలో పెట్టనున్నారు. అయితే ఆన్సర్‌ బుక్‌లెట్లు మాత్రం రెండూ కూడా ఇవ్వనున్నారు.ఇందులో ఒక దానిలో భౌతికశాస్త్రం ఇంకా అలాగే మరో దానిలో జీవశాస్త్రం కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.


ఈ రెండు సబ్జెక్టుల పేపర్లను వేర్వేరుగా పీఎస్‌ ఇంకా బీఎస్‌ టీచర్లు మూల్యాంకనం చేయాల్సి ఉన్నందున రెండు వేర్వేరు ఆన్సర్‌ బుక్‌లెట్లు ఇవ్వనున్నారు.ఇక పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా శుక్రవారం నాడు (నవంబర్‌25) డిసెంబర్‌ 10తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రెగ్యులర్‌ విద్యార్థులు ఆరు సబ్జెక్టులకు రూ.125 ఇంకా అలాగే మూడు సబ్జెక్టుల కంటే ఎక్కువకు రూ.125 ఇంకా మూడు సబ్జెక్టుల వరకు రూ.110 అలాగే ఒకేషనల్‌ విద్యార్థులు ఎక్సట్రాగా రూ.60 చెల్లించాలిసి ఉంటుంది. రూ.50 అపరాధ రుసుంతో డిసెంబరు 11 వ తేదీ నుంచి 20 వరకు, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబరు 21 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబరు 26 వ తేదీ నుంచి 30వతేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగంకి సంబంధించిన అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఇతర పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ లో పరిశీలించి తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: