రైల్వే గ్రూప్ డి పరీక్షల ఫలితాలు అప్పుడే?

Purushottham Vinay
RRB GROUP D EXAM RESULTS UPDATE

రైల్వే గ్రూప్ డి పరీక్షలు దశల వారీగా జరిపిన సంగతి తెలిసిందే.ఇక దీనికి సంబంధించి ప్రైమరీ కీతో పాటు.. రెస్పాన్స్ షీట్ ను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పటికే అభ్యర్థులు తమకు ఎన్ని మార్కులు వస్తాయో ఓ అంచనాకు అయితే రావడం జరిగింది. అయితే ఫలితాల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మంచి మెరిట్ మార్కులు సాధించిన వారు అయితే పీఈటీ కొరకు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.అలాగే తక్కువ మార్కులు వచ్చిన వారు మాత్రం నార్మలైజేషన్ స్కోర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొత్తంగా మూడేళ్ల నుంచి ఎదురు చూసిన పరీక్ష ఇక పూర్తి కాగా.. ఫలితాలను కూడా చాలా త్వరగా వెల్లడించాలని నిరుద్యోగులు ఎప్పటినుంచో కోరుతున్నారు.అయితే తెలుస్తున్న కొన్ని నివేదికల ప్రకారం.. RRB గ్రూప్ డి పరీక్ష  ఐదు దశల ఫలితాలను మొత్తం కలిపి ఒకే సారి విడుదల చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది. 


అభ్యర్థులు రైల్వే బోర్డు అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.inలో ఈ ఐదు దశల ఫలితాలను ఏకకాలంలో చెక్ చేయవచ్చు. ఇక ఫలితాల తేదీ విషయానికి వస్తే.. ఈ పరీక్ష ఫలితం ఈ వారంలో ఎప్పుడైనా కూడా రావచ్చని నిపుణులు తెలుపుతున్నారు. లేదంటే డిసెంబర్ నెల మొదటి వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఈ పరీక్షకు సంబంధించిన అన్ని అప్‌డేట్‌లను అధికారిక వెబ్ సైట్ ని ఓపెన్ చేసి తెలుసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.RRB గ్రూప్ డి పరీక్షలో ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో ఉంటుంది. అందులో మొదటిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇది ఇప్పటికే నిర్వహించబడింది. దీని తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. చివరకు మెడికల్ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ మూడు దశల్లో విజయవంతంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు గ్రూప్ డి పోస్టులకు సెలెక్ట్ చేయబడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: