కొన్ని ప్రైవేటు కంపెనీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ జాబ్ మేళాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వరుసగా జాబ్ మేళాలను పెట్టిన అధికారులు తాజాగా మంగళవారం నాడు కర్నూలు జిల్లాలో మరో జాబ్ మేళాలను జరుపుతున్నారు. రేపు (22-11-2022) ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు స్టార్ట్ కానున్నాయి. నంద్యాలలోని పీఎస్సీ, కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ జాబ్ మేళాను జరపనున్నారు. ఇక ఇందులో మొత్తం మూడు కంపెనీలు పాల్గొననున్నాయి. ఇక ఏ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొననున్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..బీపీఓ కన్వెర్జన్సీ కంపెనీలో కస్టమర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నాయి. వీటికి అభ్యర్థులు ఏదైన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక వయసు విషయానికి వస్తే 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉన్న పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం 200 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 12,000 నుంచి 20,000 వరకు జీతం చెల్లిస్తారు.
అలాగే ప్యూర్ జల్ టెక్నాలజీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులనేవి వున్నాయి. వీటికి ఇంటర్ విద్యార్హత ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న పురుషులు ఈ పోస్టులకు అర్హులు. ఇందులో మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 10,000 నుంచి రూ. 15,000+ ఇన్సెంటివ్లు అందిస్తారు. ఇందులో ఎంపికైన వారు నంద్యాలలో పనిచేయాల్సి ఉంటుంది. ఇంకా అలాగే రాయిస్ కాపిటల్లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వున్నాయి.వీటికి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు మాత్రమే అర్హులు.ఇందులో మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి.ఇందులో ఎంపికైన వారు నంద్యాలలో పని చేయాల్సి ఉంటుంది.ఈ జాబ్మేళాకు హాజరయ్యే అభ్యర్థులు రెస్యూమ్, జిరాక్స్ విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ ఇంకా అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఫార్మల్ డ్రెస్ లో ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. జాబ్ మేళాను నంద్యాల పీఎస్సీ, కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుపనున్నారు. ఇక ఈ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 8297812530 ఫోన్ నెంబర్కు సంప్రదించొచ్చు.