ఈరోజు నుంచి విద్యార్థులకు ఆఫ్ లైన్ క్లాసులు ప్రారంభం..?
ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆఫ్లైన్ తరగతులు నిర్వహించబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. అంటే ఈ రోజున ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆఫ్లైన్ తరగతులు ప్రారంభించబోతున్నట్లు తెలియజేశాడు కెసి రెడ్డి. ఇప్పటివరకు పదకొండు వందల మంది విద్యార్థులు ఇడుపులపాయలోని rk వ్యాలీ క్యాంపస్ కు చేరుకున్నారట.. ఈనెల 13వ తేదీ నుంచి.P1 విద్యార్థులకు..19 వ తేదీ నుంచి..E 3 విద్యార్థులకు ఆఫ్లైన్లో తరగతులు నిర్వహించనున్నట్లు తెలియజేయడం జరిగింది. ఇక మార్చి రెండవ తేదీ లోపు..E 1,E 2 విద్యార్థులకు ఆఫ్లైన్ తరగతులను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. అయితే కొంత మంది మాత్రం ఇటీవల ఆన్లైన్ క్లాసులను తొలగించాలంటూ తమకు మెయిల్ చేసినట్లుగా తెలియజేశారు. అందుకోసమే వారు పంపించిన వాటికి స్పందించి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని తెలియజేశారు.
ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా లోని నూజివీడు లో ఉన్న ట్రిపుల్ ఐటి ఆర్జీయూకేటీ క్యాంపస్లో మొదటి దశ కౌన్సెలింగ్ లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు.. చేరకపోవడం వల్ల సుమారుగా 60 ఆరు సీట్లు ఖాళీ అయ్యాయి.. కౌన్సిలింగ్ నిర్వహించి మళ్లీ భర్తీ చేయనున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఒంగోలు క్యాంపస్ లో 34.. శ్రీకాకుళం క్యాంపస్ లో 32 సీట్లను 2021- 22 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ పూర్తి చేయడం జరిగిందని ఆర్జీయూకేటీ ఛాన్స్లర్ ఆచార్య కె సి రెడ్డి తెలిపారు..