వీడు పోలీసులను చూస్తే సైకో అయిపోతాడట.. ఓ కానిస్టేబుల్‌ని ఎట్లా కొట్టాడో తెలిస్తే..??

praveen

ఇటీవల కాలంలో ఉన్మాదులు పబ్లిక్ రోడ్లపై వీరంగం సృష్టిస్తూ సామాన్య ప్రజలకు షాకులు ఇస్తున్నారు. పోలీసులకు కూడా వీరి నుంచి రక్షణ లేకుండా పోయింది. తాజాగా తిరుపతి జిల్లా, గూడూరు పట్టణంలో ఓ సైకో కానిస్టేబుల్ ను చంపే ప్రయత్నం చేశాడు. బండి మీద వచ్చిన పోలీస్ అధికారిని చూసి సదరు సైకో పిచ్చివాడి లాగా మారాడు. ఓ దుడ్డు కర్రతో ఆ పోలీస్ తలపై బలంగా బాదాడు. దాంతో ఆ అధికారి ఒక్కసారిగా కుప్పకూలాడు. అయినా అతడు కానిస్టేబుల్ ని చంపేటట్లు కర్రతో తల మీద పలుమార్లు దాడి చేయడం కొనసాగించాడు. అదృష్టం కొద్దీ ఆ పోలీస్ అధికారి వెనకే ఇతర పోలీసులు వచ్చారు. వారు వెంటనే ఈ యువకుడిని ఆపారు.
అనంతరం చేతిలోని కర్రను తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ అతడు దానిని వదిలిపెట్టలేదు. దాంతో ఒక పోలీసు అతడిని లాగిపెట్టి కొట్టడం వీడియోలో కనిపించింది. సాధుపేట సెంటర్‌లో ఉన్న ఒక దుకాణంలోకి హెడ్ కానిస్టేబుల్ వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ షాప్ లో ఇన్‌స్టాల్ చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
పోలీసు అధికారులు వెంటనే అప్రమత్తం కావడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ దాడిలో కానిస్టేబుల్ తల పగిలినట్లు సమాచారం. స్థానికులు ఆయనను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ సైకో పేరు లత్తు కలిండిగా పోలీసులు తెలుసుకున్నారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఈ వ్యక్తి ఎప్పుడూ తిరుపతికి వచ్చాడో తెలియ రాలేదు. కానీ స్థానికులు మాత్రం అతడు సైకో అని, పోలీసులను చూస్తే ఒక ఉన్మాదిలాగా మారతాడని చెబుతున్నారు. దాంతో వీడెక్కడి సైకో అనుకుంటూ పోలీసులు నిర్ఘాంతపోయారు. ఈ యువకుడి వయసు 25 ఏళ్లు ఉంటుంది. పోలీసు యూనిఫాంలో ఎవరు కనిపించినా వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తి బయట ఉంటే చాలా డేంజర్ అని అధికారులు అతని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: