ఎంతకీ పెళ్లి కావట్లేదని.. చివరికి అతను ఏం చేశాడంటే?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక తమ జీవితంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానిస్తూ కలకాలం కలిసి ఉండాలి ఆలోచనతో ఎంతోమంది పెళ్లి అనే బంధం లోకి అడుగుపెడుతూ ఉంటారు. ఇక కలకాలం కష్టసుఖాలను పంచుకుంటే భాగస్వామి వస్తే.. అంతకంటే ఇంకేం కావాలి అని అనుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే యువతి యువకులు ఇద్దరు కూడా పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. మనసుని అర్థం చేసుకునే అబ్బాయి కావాలి అని అమ్మాయిలు.. ఇక ఆకాశం నుంచి కలల రాకుమారుడు దిగివస్తాడు అని అమ్మాయిలు కలలు కంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమందికి మాత్రం పెళ్లి కొన్ని కొన్ని సార్లు చివరికి చావును దగ్గర చేస్తూ ఉంటుంది   అదేంటి పెళ్లి చావును దగ్గర చేయడం ఏంటి అని అనుకుంటున్నాను కదా. ఇక్కడ ఇదే జరిగింది. ఎంతకీ పెళ్లి కావడం లేదు అని మనస్థాపం చెందిన ఒక యువకుడు చివరికి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు.

 ఈ ఘటన హనుమకొండ జిల్లాలో వెలుగు లోకి వచ్చింది. పరకాల మండలం నాగారానికి చెందిన సి.బాబు అనే 27 ఏళ్ల యువకుడు అన్నయ్య రాజుతో హైదరాబాద్లోని మియాపూర్ లో మెట్రో రైలు డిపోలో సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల స్వగ్రామానికి వెళ్ళాడు. ఎన్ని సార్లు పెళ్లిచూపులు చూసిన సెట్ కావడం లేదని ఇక తనకు పెళ్లి కాదు అని భావించి. చివరికి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే పెళ్లి కావడం లేదు అనే మనస్థాపం తోనే తమ కొడుకు ప్రాణాలు వదిలాడని   తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: