లవర్ గుడ్డు కూర చేయలేదని.. అతను ఏం చేశాడో తెలుసా?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకి ఏకంగా సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొన్నటి వరకు పక్క వాళ్ళు ఎటు పోయిన పరవాలేదు. మనం మన కుటుంబం బాగుంటే సరిపోతుంది అని స్వార్థంగా ఆలోచించేవాడు మనిషి. కానీ ఇప్పుడు మాత్రం నేను బాగుంటే చాలు అని మరింత స్వార్థపూరితంగా మారిపోయి.. సొంత వారిపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు.

 ఏకంగా కుటుంబ సభ్యులను రక్తం పంచుకుని పుట్టిన వారిని దారుణంగా హత మారుస్తున్న ఘటనలు అందరిని అవాక్కేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్న హత్యలకు గల కారణాల గురించి తెలిసి ఇంత చిన్న కారణానికి కూడా ప్రాణాలు తీస్తారా అని ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించి చెప్పాలి. ఏకంగా తనకు ఇష్టమైన కూర చేయలేదు అన్న కారణంతో ప్రియురాలని దారుణంగా నరికి చంపాడు ప్రియుడు.

 గురు గ్రామ్ లో  ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా గుడ్డు కూర చేయలేదని ప్రియురాలని.. ఓ వ్యక్తి హత్య చేశాడు. లలన్ యాదవ్, అంజలి జంట గురుగ్రామ్ లో సహజీవనం చేస్తున్నారు. అయితే ఇటీవల మద్యం మత్తులో ఇంటికి వచ్చిన లలన్ యాదవ్ ఇక ప్రియురాలు అంజలిని గుడ్డు కూర చేయు అంటూ అడిగాడు  అయితే ఆమె మాత్రం పట్టించుకోలేదు  దీంతో మద్యం మత్తులో లలన్ కోపంతో ఊగిపోయాడు. ఇక బెల్టు సుత్తితో ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. అయితే దెబ్బలకు తాళలేకపోయినా అంజలి చివరికి ప్రాణాలు విడిచింది. అయితే ఇక ఇలా అంజలి ప్రాణాలు కోల్పోయింది అన్న విషయాన్ని గమనించిన లాలాన్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు తెలుపగా.   కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న  లలన్ కోసం వెతుకులాట ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: