రూ.2వేల ఫుడ్ తిని.. ఎన్ని లక్షల టిప్ ఇచ్చాడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో జనాలు ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం కంటే బయట రెస్టారెంట్ కి వెళ్లి నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకొని తినడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అంతేకాదు ఇలా ఇక పెద్దపెద్ద రెస్టారెంట్లకు వెళ్లి తింటే తమ స్టేటస్ పెరుగుతుందని ఆలోచిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో రెస్టారెంట్లలో ఒక సరికొత్త ట్రెండు కొనసాగుతూ వస్తోంది. ఈ మధ్యకాలంలో కాదు కానీ చాలా రోజుల నుంచి ఈ ట్రెండ్ ఉంది. ఇక ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువైంది అని చెప్పాలి. సాధారణంగా ఏదైనా ఆహారం ఆర్డర్ చేసుకొని తిన్న తర్వాత తమకు సర్వీస్ చేసినా సిబ్బందికి టిప్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఇలా రెస్టారెంట్ కు వెళ్ళిన కస్టమర్లు తమ తాహతకు తగ్గట్లుగా తమకు నచ్చిన విధంగా టిప్ ఇవ్వడం చూస్తూ ఉంటాం. కొంతమంది మాత్రం ఏకంగా చేసిన బిల్లు కంటే టిప్పే ఎక్కువగా ఇవ్వడం లాంటిది చేస్తూ ఉంటారు. ఇలాంటిది ఏదైనా జరిగింది అంటే చాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఇక ఇలాంటి ఘటన గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా కొంతమంది వేల రూపాయల బిల్లు చేసి లక్షల రూపాయల టిప్ చెల్లించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు  ఇలాంటివి చూసినప్పుడు వీరి దగ్గర ఏమైనా డబ్బులు ఎక్కువగా ఉన్నాయా ఏంటి అనే భావన అందరికీ కలుగుతూ ఉంటుంది.

 ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు. ఏకంగా వేలల్లో బిల్లు చేసి ఎనిమిది లక్షల టిప్ ఇచ్చాడు. అమెరికాలో ఈ విచిత్రమైన ఘటన జరిగింది అని చెప్పాలి.  మిచిగాన్ రెస్టారెంట్లో భోజనం చేయడానికి వెళ్ళాడు ఒక కస్టమర్. ఇక తనకు కావలసిన ఆహారాన్ని తెప్పించుకొని హాయిగా ఆరగించాడు. అయితే బిల్లు కట్టే సమయంలో అతను చేసిన పని మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా పదివేల డాలర్లు టిప్పుగా ఇచ్చాడు. మార్క్ అనే వ్యక్తి రెస్టారెంట్లో 32.43 డాలర్ అంటే 2000 విలువైన ఫుడ్ తిన్నాడు. బిల్లు కట్టే సమయంలో మాత్రం మరణించిన స్నేహితుడి గౌరవార్థం ఏకంగా ఎనిమిది లక్షల టిప్ ఇచ్చి అక్కడ ఉన్న సిబ్బంది అందరిని కూడా ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి. ఈ విషయం తెలిసి నేటిజన్స్  సైతం షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tip

సంబంధిత వార్తలు: