తన అప్పు తీర్చాలని.. దేవుడికి లేఖ రాసిన భక్తుడు.. ఎక్కడంటే?

praveen
ఇండియాలో దైవభక్తి ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా జనాలలో ఉండే దైవభక్తిని క్యాష్ చేసుకొనెందుకే కొంతమంది బురిడీ బాబాల అవతారమెత్తి భారీగా డబ్బులు దండుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మన దేశంలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా ముందుగా చెప్పుకునేది డాక్టర్ కో.. లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులకో కాదు గుడికి వెళ్లి దేవుడి ముందు తమ బాధలు అని చెప్పుకుంటూ ఉంటాడు ప్రతి మనిషి. ఎందుకో దేవుడికి బాధలు చెప్పుకుంటే కాస్త ధైర్యం వస్తుంది అని నమ్ముతూ ఉంటాడు. ఇక ఆ దేవుడు తన బాధలను తీరుస్తాడు అని విశ్వసిస్తూ ఉంటాడు అని చెప్పాలి.

 ఇలా ఇండియాలో దైవభక్తి కాస్త ఎక్కువగా ఉంది కాబట్టే ఆలయాలు మసీదులు చర్చిలు అన్నీ కూడా ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక ఇలా దేవుడికి దగ్గరికి వెళ్ళిన భక్తులు కొన్ని కొన్ని సార్లు వింతైన కోరికలు కోరడం కూడా చూస్తూ ఉంటాం. పరీక్షల్లో చదవకుండానే పాస్ కావాలని కొంతమంది.. ఇక ఇంటి దగ్గర కూర్చుని భారీగా డబ్బులు సంపాదించాలని ఇంకొంతమంది దేవునికి మొక్కుకుంటూ ఉంటారు. తమ కోరికలు తీర్చాలి అని ఏకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి వింతైన కోరికలు విని ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది.

 ఇప్పుడు ఒక భక్తుడు ఇలాగే దేవుడికి ఒక లేఖ రాశాడు. ఇంతకీ లేక దేనికోసమో తెలుసా.. ఏకంగా తనకు ఉన్న అప్పులు మొత్తం దేవుడే తీర్చాలి అని ఆ లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ లేక సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. తమిళనాడులోని ధర్మపురి కుమారస్వామి పేటలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయ హుండీ లెక్కింపును జరిపారు ఆలయ అధికారులు. ఈ క్రమంలోనే హుండీ కానుకలు లెక్కిస్తుండగా సిబ్బందికి అందులో ఒక లేఖ కనిపించింది. ఇక ఇందులో తనకున్న అప్పుల వివరాలను ఒక భక్తుడు రాశాడు. అప్పుల కింద శ్లోకాలు కూడా రాశాడు. తన అప్పులు మొత్తం దేవుడే కట్టాలి అంటూ రిక్వెస్ట్ కూడా చేసుకున్నాడు. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: